Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:58 AM

నీలం మధు ముదిరాజ్ పాల్గొన్న రథసప్తమి పూజా కార్యక్రమం ఘనంగా పూర్తి

నీలం మధు ముదిరాజ్ పాల్గొన్న రథసప్తమి పూజా కార్యక్రమం ఘనంగా పూర్తి

నీలం మధు ముదిరాజ్ పాల్గొన్న రథసప్తమి పూజా కార్యక్రమం ఘనంగా పూర్తి
January 25, 2026 09:37 PM 18 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

సూర్య భగవంతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రథసప్తమి రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు.ఆదివారం రథసప్తమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఫసల్వాది గ్రామ పరిధిలోని శ్రీ జ్యోతిష్వరస్తు విద్యాపీఠంలో ఘనంగా పాపనాశ రథసప్తమి వ్రతక్రతువు పూజా కార్యక్రమం నిర్వహించబడింది.ఈ పూజా కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. కార్యక్రమంలో వ్రతధారులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిసరితంగా పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో నీలం మధు కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపడుచులు, యువతులు మరియు వృద్ధులు ఇంత పెద్ద సంఖ్యలో భక్తిసహితంగా వ్రతంలో పాల్గొని సద్గుణ పుణ్యాలు సాదించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. రథసప్తమి వ్రతం ద్వారా భక్తుల జీవితాలలో వెలుగులు పూయాలని, వారి పాపాలు తొలగి, సమస్త ప్రజలు ఆరోగ్యంగా, సుఖసమృద్ధిగా, భద్రంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు.వ్రతక్రతువు పూజా కార్యక్రమంలో ప్రాంతీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొని సాంప్రదాయపరంగా, భక్తిపరంగా వ్రతాన్ని నిర్వహించారు. ఈ ఘన కార్యక్రమం స్థానిక ప్రజల్లో సంతృప్తిని, సానుకూల భక్తి శక్తిని వెలిగించిందని అక్కడి వాతావరణం సూచించింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News