నీలం మధు ముదిరాజ్ పాల్గొన్న రథసప్తమి పూజా కార్యక్రమం ఘనంగా పూర్తి
నీలం మధు ముదిరాజ్ పాల్గొన్న రథసప్తమి పూజా కార్యక్రమం ఘనంగా పూర్తి
Sthanikam District Staff Reporter krishna
ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ
సూర్య భగవంతుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రథసప్తమి రోజున భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ తెలిపారు.ఆదివారం రథసప్తమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి నియోజకవర్గానికి చెందిన ఫసల్వాది గ్రామ పరిధిలోని శ్రీ జ్యోతిష్వరస్తు విద్యాపీఠంలో ఘనంగా పాపనాశ రథసప్తమి వ్రతక్రతువు పూజా కార్యక్రమం నిర్వహించబడింది.ఈ పూజా కార్యక్రమాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో ఘనంగా చేపట్టారు. కార్యక్రమంలో వ్రతధారులు, భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తిసరితంగా పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో నీలం మధు కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆడపడుచులు, యువతులు మరియు వృద్ధులు ఇంత పెద్ద సంఖ్యలో భక్తిసహితంగా వ్రతంలో పాల్గొని సద్గుణ పుణ్యాలు సాదించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. రథసప్తమి వ్రతం ద్వారా భక్తుల జీవితాలలో వెలుగులు పూయాలని, వారి పాపాలు తొలగి, సమస్త ప్రజలు ఆరోగ్యంగా, సుఖసమృద్ధిగా, భద్రంగా జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
వ్రతక్రతువు పూజా కార్యక్రమంలో ప్రాంతీయ నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు తదితరులు పాల్గొని సాంప్రదాయపరంగా, భక్తిపరంగా వ్రతాన్ని నిర్వహించారు. ఈ ఘన కార్యక్రమం స్థానిక ప్రజల్లో సంతృప్తిని, సానుకూల భక్తి శక్తిని వెలిగించిందని అక్కడి వాతావరణం సూచించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి