హాజరుకానున్న మంత్రి దామోదర రాజనరసింహ
సంగారెడ్డి జిల్లా అందోల్ గ్రామంలోని శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయంలో శనివారం ఉదయం 11:30 గంటలకు గోదారంగనాథస్వామి వార్ల కళ్యాణ మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరుకానున్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వారి కల్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ ప్రధాన అర్చకులు చిదిరె శ్యామనాథ శర్మ తెలిపారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి