Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సతీష్‌నగర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు..భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.. భక్తులకు అన్నదానం సీఎం, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో సభా వేదిక, భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 12, 2026 10:12 PM

నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు వెంటనే చైర్మన్‌ నియమించాలి.

నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు వెంటనే చైర్మన్‌ నియమించాలి.

నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు వెంటనే చైర్మన్‌ నియమించాలి.
May 12, 2026 08:31 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ హామీలు అమలు చేయాలి: చెన్నారం మల్లేష్‌

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు వెంటనే చైర్మన్‌ను నియమించాలని క్షౌర వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నారం మల్లేష్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామంలో క్షౌర వృత్తిదారుల సమస్యలపై నిర్వహించిన గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశం వేముల దయాకర్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చెన్నారం మల్లేష్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన తమకు తగిన వాటా కల్పించాలని కోరారు.

నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు చైర్మన్‌తో పాటు ప్రతి జిల్లాకు డైరెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ వృత్తిదారులపై సామాజిక వివక్ష, దాడులు జరుగకుండా వృత్తి రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు.

క్షౌర వృత్తిదారులు కేవలం కేశాలంకరణకే పరిమితం కాకుండా మంగళ వాయిద్యాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారని గుర్తు చేశారు. ఆధునిక పరికరాలపై అవగాహన కల్పించడంతో పాటు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

వృత్తిదారుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాట కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో క్షౌర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల సైదులు, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చెన్నారపు సత్తయ్య, గ్రామ నాయకులు వేముల దుర్గయ్య, రాము, నరేష్‌, మచ్చగిరి, అనిల్‌, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News