న్యాయవాదులతో సమావేశం
న్యాయవాదులతో సమావేశం
Biksham Goud
మధిర మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు కోరిన నాయకులు
ఖమ్మం జిల్లా మధిర: మధిర మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో మధిర పట్టణంలోని న్యాయవాదులతో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కోండబాల కోటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు వాసిరెడ్డి రామనాధం సమావేశమయ్యారు. ఈ సమావేశం గురువారం మధిర మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించారు.ఈ సందర్భంగా రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని న్యాయవాదులను కోరారు. అధికార పార్టీకి అండగా నిలిస్తే ప్రజల సమస్యలకు వేగంగా పరిష్కారం లభిస్తుందని తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని అన్నారు.మధిర నియోజకవర్గంలో భట్టి విక్రమార్క చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు న్యాయవాదులు మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. పట్టణ అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో న్యాయవాదులు తమ సమస్యలను నాయకుల దృష్టికి తీసుకువచ్చి చర్చించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి