Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:12 AM

న్యాల్కల్‌లో సంధి వివాదం ముదిరింది.. పైపులు తొలగించి హామీ మరిచిన శివశంకర్

న్యాల్కల్‌లో సంధి వివాదం ముదిరింది.. పైపులు తొలగించి హామీ మరిచిన శివశంకర్

న్యాల్కల్‌లో సంధి వివాదం ముదిరింది.. పైపులు తొలగించి హామీ మరిచిన శివశంకర్
24-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని 5వ వార్డ్ శ్రీ రామ్ నగర్ కాలనీలో సంధి, మేనమాల, డ్రైనేజ్ పైపుల అంశంపై తీవ్ర వివాదం చెలరేగింది. స్థానికులకు చెందిన సున్నపు శివశంకర్ కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టే సమయంలో జేసీబీ సహాయంతో అక్కడ ఉన్న పాత పైపులను పూర్తిగా తొలగించినట్లు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.ఆ సమయంలో తొలగించిన పైపులకు బదులుగా కొత్త పైపులు వేస్తానని శివశంకర్ హామీ ఇచ్చినప్పటికీ, ఏడు నెలలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో వర్షాకాలంలో మురుగు నీరు నిల్వ ఉండటం, రాకపోకలకు ఇబ్బందులు కలగడం వంటి సమస్యలు తీవ్రంగా మారాయని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదే విషయంపై బిచ్చి రెడ్డి కుటుంబానికి చెందిన పద్మావతి ప్రశ్నించగా, ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్లు సమాచారం. కొంతసేపు కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, స్థానికులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేసినట్లు తెలిసింది.ఈ సమస్యపై పలుమార్లు గ్రామపంచాయతీ కార్యాలయానికి ఫిర్యాదులు చేసినప్పటికీ గ్రామపంచాయతీ సెక్రెటరీ శ్రీకాంత్ రెడ్డి స్పందించడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చిన్న సమస్య పెద్ద వివాదంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఘటన న్యాల్కల్ మండల కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Sthanikam

న్యాల్కల్‌లో సంధి వివాదం ముదిరింది.. పైపులు తొలగించి హామీ మరిచిన శివశంకర్

Article Image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని 5వ వార్డ్ శ్రీ రామ్ నగర్ కాలనీలో సంధి, మేనమాల, డ్రైనేజ్ పైపుల అంశంపై తీవ్ర వివాదం చెలరేగింది. స్థానికులకు చెందిన సున్నపు శివశంకర్ కొత్త ఇల్లు నిర్మాణం చేపట్టే సమయంలో జేసీబీ సహాయంతో అక్కడ ఉన్న పాత పైపులను పూర్తిగా తొలగించినట్లు కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు.ఆ సమయంలో తొలగించిన పైపులకు బదులుగా కొత్త పైపులు వేస్తానని శివశంకర్ హామీ ఇచ్చినప్పటికీ, ఏడు నెలలు గడిచినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు. దీంతో వర్షాకాలంలో మురుగు నీరు నిల్వ ఉండటం, రాకపోకలకు ఇబ్బందులు కలగడం వంటి సమస్యలు తీవ్రంగా మారాయని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇదే విషయంపై బిచ్చి రెడ్డి కుటుంబానికి చెందిన పద్మావతి ప్రశ్నించగా, ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారితీసినట్లు సమాచారం. కొంతసేపు కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, స్థానికులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను శాంతింపజేసినట్లు తెలిసింది.ఈ సమస్యపై పలుమార్లు గ్రామపంచాయతీ కార్యాలయానికి ఫిర్యాదులు చేసినప్పటికీ గ్రామపంచాయతీ సెక్రెటరీ శ్రీకాంత్ రెడ్డి స్పందించడం లేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే చిన్న సమస్య పెద్ద వివాదంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం ఈ ఘటన న్యాల్కల్ మండల కేంద్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారగా, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News