న్యాల్కల్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
న్యాల్కల్లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
Reporter Sangameshwar Reddy
₹20 లక్షలతో NREGS కింద అభివృద్ధి పనులు ప్రారంభం
న్యాల్కల్,
మండల కేంద్రంలోని అభివృద్ధి పనులకు సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి-ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.కేంద్ర ప్రభుత్వ NREGS పథకం కింద సుమారు ₹20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. పనులు పూర్తయితే గ్రామంలో మౌలిక వసతులు మెరుగుపడనున్నాయని సర్పంచ్ తెలిపారు.గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఈ పనులకు సహకరించిన ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి, ఉప సర్పంచ్ సరోజ, ఆంజనేయులు, సత్యనారాయణ, హోతి నాగిశెట్టి, సతీష్ మహారాజ్, గిరీష్ మహారాజ్, బక్క రెడ్డి, బొల్లి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి