Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:43 AM

న్యాల్కల్‌లో పశు వైద్య సంరక్షణ శిబిరం

న్యాల్కల్‌లో పశు వైద్య సంరక్షణ శిబిరం

న్యాల్కల్‌లో పశు వైద్య సంరక్షణ శిబిరం
February 10, 2026 04:11 PM 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

పశువుల ఆరోగ్యం మెరుగైతే రైతు బతుకు బాగుంటుంది

న్యాల్కల్ మండలం రామతీర్థం గ్రామంలో పశు వైద్య సంరక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో పశు వైద్యుడు డాక్టర్ గణేష్ పశువులకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. ముఖ్యంగా గేదెలు, ఆవులు, దూడలకు సంబంధించిన వ్యాధులు, టీకాల అవసరం, ఆహార నియమాలు, శుభ్రత వంటి అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

పశువుల ఆరోగ్యం బాగుంటేనే రైతుల ఆదాయం పెరుగుతుందని, పాల ఉత్పత్తి మెరుగవుతుందని డాక్టర్ గణేష్ వివరించారు. కాలానుగుణంగా టీకాలు వేయించుకోవడం, పోషకాహారం అందించడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మమ్మ మాట్లాడుతూరైతుల జీవనాధారమైన పశువుల సంరక్షణకు ఇలాంటి శిబిరాలు ఎంతో అవసరమని అన్నారు.

భవిష్యత్తులో కూడా పశు వైద్య శాఖ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పశువులకు వైద్య సేవలు పొందారు. ఇలాంటి పశు వైద్య సంరక్షణ కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని రైతులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News