Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:46 PM

న్యాల్కల్‌లో పశు వైద్య సంరక్షణ శిబిరం

న్యాల్కల్‌లో పశు వైద్య సంరక్షణ శిబిరం

న్యాల్కల్‌లో పశు వైద్య సంరక్షణ శిబిరం
February 10, 2026 04:11 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

పశువుల ఆరోగ్యం మెరుగైతే రైతు బతుకు బాగుంటుంది

న్యాల్కల్ మండలం రామతీర్థం గ్రామంలో పశు వైద్య సంరక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో పశు వైద్యుడు డాక్టర్ గణేష్ పశువులకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. ముఖ్యంగా గేదెలు, ఆవులు, దూడలకు సంబంధించిన వ్యాధులు, టీకాల అవసరం, ఆహార నియమాలు, శుభ్రత వంటి అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.

పశువుల ఆరోగ్యం బాగుంటేనే రైతుల ఆదాయం పెరుగుతుందని, పాల ఉత్పత్తి మెరుగవుతుందని డాక్టర్ గణేష్ వివరించారు. కాలానుగుణంగా టీకాలు వేయించుకోవడం, పోషకాహారం అందించడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మమ్మ మాట్లాడుతూరైతుల జీవనాధారమైన పశువుల సంరక్షణకు ఇలాంటి శిబిరాలు ఎంతో అవసరమని అన్నారు.

భవిష్యత్తులో కూడా పశు వైద్య శాఖ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పశువులకు వైద్య సేవలు పొందారు. ఇలాంటి పశు వైద్య సంరక్షణ కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని రైతులు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News