న్యాల్కల్లో పశు వైద్య సంరక్షణ శిబిరం
న్యాల్కల్లో పశు వైద్య సంరక్షణ శిబిరం
Reporter Sangameshwar Reddy
పశువుల ఆరోగ్యం మెరుగైతే రైతు బతుకు బాగుంటుంది
న్యాల్కల్ మండలం రామతీర్థం గ్రామంలో పశు వైద్య సంరక్షణ శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరంలో పశు వైద్యుడు డాక్టర్ గణేష్ పశువులకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులు పంపిణీ చేశారు. ముఖ్యంగా గేదెలు, ఆవులు, దూడలకు సంబంధించిన వ్యాధులు, టీకాల అవసరం, ఆహార నియమాలు, శుభ్రత వంటి అంశాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించారు.
పశువుల ఆరోగ్యం బాగుంటేనే రైతుల ఆదాయం పెరుగుతుందని, పాల ఉత్పత్తి మెరుగవుతుందని డాక్టర్ గణేష్ వివరించారు. కాలానుగుణంగా టీకాలు వేయించుకోవడం, పోషకాహారం అందించడం ద్వారా అనేక వ్యాధులను ముందుగానే నివారించవచ్చని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మమ్మ మాట్లాడుతూరైతుల జీవనాధారమైన పశువుల సంరక్షణకు ఇలాంటి శిబిరాలు ఎంతో అవసరమని అన్నారు.
భవిష్యత్తులో కూడా పశు వైద్య శాఖ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ పశువులకు వైద్య సేవలు పొందారు. ఇలాంటి పశు వైద్య సంరక్షణ కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని రైతులు కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి