న్యాల్కల్లో బంజారా భవన్కు కృషి : మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి
న్యాల్కల్లో బంజారా భవన్కు కృషి : మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్ మండల కేంద్రంలో బంజారా భవన్ (సేవాలాల్ సామూహిక భవనం) నిర్మాణానికి కృషి చేస్తామని న్యాల్కల్ సహకార సంఘం మాజీ చైర్మన్ సిద్ధి లింగయ్య స్వామి తెలిపారు. సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొని ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. స్థానిక ఎంపీ సురేష్కుమార్ షెట్కార్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లి భవన నిర్మాణానికి చర్యలు తీసుకునేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.మండల సేవాలాల్ మహారాజ్ సంగం ఆధ్వర్యంలో అధికార పార్టీ ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు సక్కులాల్, రుక్మాపూర్ గ్రామ సర్పంచ్ సురేష్కుమార్ నేతృత్వంలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. న్యాల్కల్ ఆర్టీసీ బస్టాండ్ నుండి శివాజీ మహారాజ్ కూడలి వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి – ప్రవీణ్కుమార్తో పాటు పలువురు సేవాలాల్ భక్తులు శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి