Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:08 AM

న్యాల్కల్: వివక్షకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – ఎస్సీ ఎస్‌ఐ ఆర్డీ శ్యామ్ రావు పాటిల్

న్యాల్కల్: వివక్షకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – ఎస్సీ ఎస్‌ఐ ఆర్డీ శ్యామ్ రావు పాటిల్

న్యాల్కల్: వివక్షకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – ఎస్సీ ఎస్‌ఐ ఆర్డీ శ్యామ్ రావు పాటిల్
31-01-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం టేకూర్ గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆర్డీ శ్యామ్ రావు పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంటరానితనం, రెండు గ్లాసుల విధానం వంటి వివక్ష చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానులేనని, కులం లేదా వర్గం పేరుతో ఎవరికీ వివక్ష చూపేందుకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

గ్రామాల్లో సామాజిక సమానత్వం పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, చట్టాలను గౌరవిస్తూ పరస్పర గౌరవంతో మెలగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఐక్యతతో జీవించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్‌తో పాటు గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


టేకూర్ గ్రామం, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి

జిల్లా


Sthanikam

న్యాల్కల్: వివక్షకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – ఎస్సీ ఎస్‌ఐ ఆర్డీ శ్యామ్ రావు పాటిల్

Article Image

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం టేకూర్ గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ సబ్‌ఇన్‌స్పెక్టర్ ఆర్డీ శ్యామ్ రావు పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంటరానితనం, రెండు గ్లాసుల విధానం వంటి వివక్ష చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానులేనని, కులం లేదా వర్గం పేరుతో ఎవరికీ వివక్ష చూపేందుకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

గ్రామాల్లో సామాజిక సమానత్వం పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, చట్టాలను గౌరవిస్తూ పరస్పర గౌరవంతో మెలగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఐక్యతతో జీవించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్‌తో పాటు గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


టేకూర్ గ్రామం, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి

జిల్లా


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News