న్యాల్కల్: వివక్షకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – ఎస్సీ ఎస్ఐ ఆర్డీ శ్యామ్ రావు పాటిల్
న్యాల్కల్: వివక్షకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు – ఎస్సీ ఎస్ఐ ఆర్డీ శ్యామ్ రావు పాటిల్
Reporter Sangameshwar Reddy
సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం టేకూర్ గ్రామంలో శనివారం పౌర హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ సబ్ఇన్స్పెక్టర్ ఆర్డీ శ్యామ్ రావు పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంటరానితనం, రెండు గ్లాసుల విధానం వంటి వివక్ష చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానులేనని, కులం లేదా వర్గం పేరుతో ఎవరికీ వివక్ష చూపేందుకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు.
గ్రామాల్లో సామాజిక సమానత్వం పాటించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని, చట్టాలను గౌరవిస్తూ పరస్పర గౌరవంతో మెలగాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఐక్యతతో జీవించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సంగమేశ్వర్తో పాటు గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
టేకూర్ గ్రామం, న్యాల్కల్ మండలం, సంగారెడ్డి
జిల్లా

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి