Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 05:31 AM

న్యాల్కల్ పశువుల జాతర: రూ.5.40 లక్షల వరకు ధరలు, రైతుల ఆనందం

న్యాల్కల్ పశువుల జాతర: రూ.5.40 లక్షల వరకు ధరలు, రైతుల ఆనందం

న్యాల్కల్ పశువుల జాతర: రూ.5.40 లక్షల వరకు ధరలు, రైతుల ఆనందం
February 02, 2026 07:01 AM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామ శివారులోని దర్గా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పశువుల జాతరకు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాణ్యమైన పశువుల కొనుగోలు కోసం సంత ప్రాంగణం ఉదయం నుంచే సందడిగా మారింది.

పశువుల సంతలో దియోని, ఒంగోలు, కిల్లరి జాతులకు చెందిన ఎద్దులు, కోడెదూడలు, ఆవులు, పాడిగేదెలు అమ్మకానికి రాగా, ధరలు సుమారు రూ.50 వేల నుంచి రూ.5.40 లక్షల వరకు పలికాయి. ఈ జాతరలో రాయికోడ్ మండల్ జంగా (ఖుర్ద్) గ్రామానికి చెందిన సమీర్ రూ.2.40 లక్షలకు ఎద్దుల జతను కొనుగోలు చేశాడు. అనంతరం దర్గా దర్శనం చేసుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారుల పాల్గొనడంతో పశువుల ధరలు భారీగా పెరిగాయని రైతులు తెలిపారు. నాణ్యమైన జాతి పశువులకు మంచి డిమాండ్ ఉండటంతో ఈ జాతర రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా నిలిచింది.

ఉత్తమ పశుపోషకులైన రైతులకు స్థానిక గ్రామానికి చెందిన దివంగత అడివప్ప, గిరిజమ్మ జ్ఞాపకార్థం బహుమతులను జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, పట్టణ సీఐ శివలింగం, హద్నూర్ ఎస్‌ఐ దోమ సుజిత్ కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ రికార్డు సాధించిన ప్రముఖ శిల్పకారుడు డా. హోతి బస్వరాజ్, జాతర నిర్వాహకులు యూనుస్ ఖాన్, మక్సూద్, నర్సింహులు, వాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News