న్యాల్కల్ పశువుల జాతర: రూ.5.40 లక్షల వరకు ధరలు, రైతుల ఆనందం
న్యాల్కల్ పశువుల జాతర: రూ.5.40 లక్షల వరకు ధరలు, రైతుల ఆనందం
Reporter Sangameshwar Reddy
జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామ శివారులోని దర్గా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన పశువుల జాతరకు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నాణ్యమైన పశువుల కొనుగోలు కోసం సంత ప్రాంగణం ఉదయం నుంచే సందడిగా మారింది.
పశువుల సంతలో దియోని, ఒంగోలు, కిల్లరి జాతులకు చెందిన ఎద్దులు, కోడెదూడలు, ఆవులు, పాడిగేదెలు అమ్మకానికి రాగా, ధరలు సుమారు రూ.50 వేల నుంచి రూ.5.40 లక్షల వరకు పలికాయి. ఈ జాతరలో రాయికోడ్ మండల్ జంగా (ఖుర్ద్) గ్రామానికి చెందిన సమీర్ రూ.2.40 లక్షలకు ఎద్దుల జతను కొనుగోలు చేశాడు. అనంతరం దర్గా దర్శనం చేసుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారుల పాల్గొనడంతో పశువుల ధరలు భారీగా పెరిగాయని రైతులు తెలిపారు. నాణ్యమైన జాతి పశువులకు మంచి డిమాండ్ ఉండటంతో ఈ జాతర రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా నిలిచింది.
ఉత్తమ పశుపోషకులైన రైతులకు స్థానిక గ్రామానికి చెందిన దివంగత అడివప్ప, గిరిజమ్మ జ్ఞాపకార్థం బహుమతులను జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్, పట్టణ సీఐ శివలింగం, హద్నూర్ ఎస్ఐ దోమ సుజిత్ కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ రికార్డు సాధించిన ప్రముఖ శిల్పకారుడు డా. హోతి బస్వరాజ్, జాతర నిర్వాహకులు యూనుస్ ఖాన్, మక్సూద్, నర్సింహులు, వాహెబ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి