Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! బస్టాండ్‌ వద్ద ‘అండర్‌ పాస్‌’ నిర్మించాలి ​- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కౌన్సిలర్‌ వినతి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 04:42 AM

నాయకులుగా కాదుసేవకులుగా ఉంటాo బొబ్బలి సందీప రామ్ రెడ్డి

నాయకులుగా కాదుసేవకులుగా ఉంటాo బొబ్బలి సందీప రామ్ రెడ్డి

 నాయకులుగా కాదుసేవకులుగా ఉంటాo బొబ్బలి సందీప రామ్ రెడ్డి
February 09, 2026 08:05 AM 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా 11వ వార్డు లో అధికార పార్టీ అభ్యర్థి మునగాల సందీప బొబ్బిలి రాంరెడ్డి గెలుపు దిశగా తన ప్రచార హోరును సాగిస్తున్నారు. ఆదివారం రోజున ఎన్నికల ప్రచారంలో భాగంగా 11వ వార్డులో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో ప్రచారం నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నకిరేకల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో అభివృద్ధి పనులను చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ వలన అభివృద్ధి సాధ్యమవుతుందని, , వీధి దీపాలు, డ్రైనేజీ, తదితర మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఎప్పుడు ప్రజల ముందు ఉంటానని తెలియజేశారు. అంతేకాకుండా వార్డులో ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకువస్తే ఎమ్మెల్యే సహకారంతో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు. నాయకుడిలా కాకుండా ప్రజల మధ్య ఉండే సేవకుడిగా పనిచేస్తూ, ప్రతి సమస్యకు తక్షణ పరిష్కారం అందించేలా కృషి చేస్తానని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ఇతర పార్టీలకు తగిన గుణపాఠం చెప్పేందుకు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఏనుగు అంజిరెడ్డి నర్మద , మన్నెం సైదులు , ఇమ్మడి వెంకన్న, ముప్ప ముత్తిరెడ్డి, బొర్రా రెడ్డి చోల్లేటి శ్రీకాంత్, దామనూరి, సైదులు నర్సిరెడ్డి, మాద శ్రీను, ఆమనగంటి నరేష్ షేక్ అక్రమ్ గుంటోజు శ్రీను, గుంటోజు సంతోష్, మరియు యువజన విభాగం నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News