Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:41 AM

నవోదయం 2.0లో ఉగ్రరూపం… నాటు సారా ముఠాలపై ఎక్సైజ్ దాడులు

నవోదయం 2.0లో ఉగ్రరూపం… నాటు సారా ముఠాలపై ఎక్సైజ్ దాడులు

నవోదయం 2.0లో ఉగ్రరూపం… నాటు సారా ముఠాలపై ఎక్సైజ్ దాడులు
February 14, 2026 04:57 PM 107 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా రహిత ఆంద్ర ప్రదేశ్ కోసం ప్రభుత్వం నూతనముగా ప్రవేశ పెట్టిన నవోదయం 2.0 అనే కార్యక్రమము లో బాగముగా అసిస్టెంట్ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ సి.హెచ్.అజయ్ కుమార్ సింగ్ ఆధ్వర్యములో ఎన్ ఫోర్సు మెంట్ ఇన్స్పెక్టర్ వై.వి.యన్.యస్.ఫణి కుమార్ మరియు వారి సిబ్బంది మరియు నూజివీడు స్టేషన్ సిబ్బంది కలిసి చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండ గ్రామంలో దాడులు చేయగా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామమునకు చెందిన మావుళ్ళ శ్రీను తండ్రి వెంకటేష్ మరియు మావుళ్ళ నాగ రాజు తండ్రి వెంకట్రావు అను ఇద్దరినీ అదుపులోనికి తీసుకోని వారి వద్ద నుండి 10 లీటర్ల నాటు సారాయి రెండు వాహనములను స్వాదిన పరచుకొని వీరికి సారా ను సప్లై చేస్తున్న చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండా కు చెందిన ధారావతు భాస్కర రావు తండ్రి లష్కర్ అను అతని పై కేసు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ.మస్తానయ్య తెలియజేశారు. నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి నూజివీడు ముసునూరు చాట్రాయి మండలంలో బెల్ట్ షాపులు నిర్వహించే వారి పైన నాటు సారాయి తయారుచేసిన అమ్మిన కలిగి ఉన్న నేరమని నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం సప్లై చేసే వ్యాపారుల పైన మరియు నాటు సారా తయారీ ఉపయోగించే బెల్లపు ఊట కలిగి ఉన్న భూ యజమానుల పైన కూడా కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ యొక్క ఫోన్ నెంబర్ 9440902462 కి సమాచారం తెలియజేసిన వెంటనే చర్యలు తీసుకుంటామని సమాచారం అందించిన వారి యొక్క వివరములను గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News