నవజాత శిశువు మృతి
నవజాత శిశువు మృతి
Editor Desk
పాపను వదిలివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
స్థానికం: భువనగిరి రిపోర్టర్ ఎన్.కుమార్
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల పడమటి సోమారం గ్రామంలోని శ్రీ లింగ భశ్వేశ్వర ఆలయం లో వదిలివేసిన శిశువును బుధవారం డాక్టర్ల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. కానీ దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ ఆ శిశువు గురువారం అర్థరాత్రి మృతి చెందినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి నర్సింహారావు గురువారం తెలిపారు. పాప హాట్ బీట్ తగ్గడం,చలిలో వదిలివేసిన కారణంగా శిశువు శరీరంలో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల పాప మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారని నర్సింహారావు తెలిపారు. పడమటి సోమారం గ్రామంలోని శ్రీ లింగ భశ్వేశ్వర ఆలయంలో బుధవారం తెల్లవారుజామున అప్పుడే పుట్టిన పాపను వదిలివేసిన వారిని పోలీసులు వెంటనే గుర్తించాలని,వారిపై కేసు నమోదు చేసి, కఠినంగా శిక్షించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ కొడారి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జిల్లా కలెక్టర్,మరియు అధికారులు చూడాలని ఆయన కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి