నూజివీడు లో ఎక్సైజ్ పాత నేరస్తుల బైండోవర్
నూజివీడు లో ఎక్సైజ్ పాత నేరస్తుల బైండోవర్
GADDAM JAGANMOHAN REDDY
ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి
సంక్రాంతి పండుగ సందర్భంగా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన నవోదయం-2.0 కార్యక్రమంలో భాగంగా చర్యలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పాత నేరస్తులు (05) మందిని నూజివీడు తహసిల్దార్ (మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్) ఎదుట హాజరు పరచి బైండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్, ఈ బైండ్ ఓవర్ ఒక (01) సంవత్సరం కాల పరిమితి కలిగి ఉంటుందని, ఈ కాల వ్యవధిలో మరల ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తుల నుండి రూ.1,00,000/-(లక్ష రూపాయలు) జరిమానా విధించబడుతుందని మరియు ప్రభుత్వ పథకాలు కూడా రద్దు చేయబడతాయని పాత నేరస్తులను కఠినంగా హెచ్చరించారు. 1) మాటూరి దత్త ప్రకాష్, తండ్రి వాయు కుమార్ నివాసము నూజివీడు పట్టణం - బెల్లం వ్యాపారి 2) దేవరకొండ కోటమ్మ, భర్త వెంకటేశ్వర రావు నివాసము అన్నవరం 3) అజ్మీర విజయ్ తండ్రి పంగిడయ్య నివాసము ఒగిరాలతండ 4) కొనకళ్ళ కోటేశ్వర రావు తండ్రి తిరుపతయ్య, నివాసము సుంకొల్లు గ్రామము 5) లావురి వెంకట శ్రీనివాస రావు తండ్రి పాప, నివాసము సిధార్థ నగర్ తండ గ్రామము నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి నూజివీడు ముసునూరు చాట్రాయి మండలంలో బెల్ట్ షాపులు నిర్వహించే వారి పైన నాటు సారాయి తయారుచేసిన అమ్మిన కలిగి ఉన్న నేరమని నాటు సారా తయారీకి ఉపయోగించే బెల్లం సప్లై చేసే వ్యాపారుల పైన మరియు నాటు సారా తయారీ ఉపయోగించే బెల్లపు ఊట కలిగి ఉన్న భూ యజమానుల పైన కూడా కేసులు నమోదు చేస్తామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి