Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత రేషన్ బియ్యం పంపిణీకి కేంద్రం నిర్ణయం మూడు నెలల సరఫరా… పేదలకు ఉపశమనం: అక్కెనపల్లి సైదులు సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 12:24 PM

నూజివీడు లో ఎక్సైజ్ అధికారుల ముమ్మర తనిఖీలు

నూజివీడు లో ఎక్సైజ్ అధికారుల ముమ్మర తనిఖీలు

నూజివీడు లో ఎక్సైజ్ అధికారుల ముమ్మర తనిఖీలు
January 06, 2026 10:10 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా ప్రతినిధి గడ్డం జగన్మోహన్ రెడ్డి నూజివీడు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు విదేశాల నుంచి నూజివీడు స్టేషన్ పరిధిలోని నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు మరియు చాట్రాయి మండలాలకు పెద్ద ఎత్తున ప్రజల రాకపోకలు జరుగుతున్న నేపథ్యంలో, మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలతో రహదారులపై వాహనాల తనిఖీలు చేపట్టినట్లు నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఏ. మస్తానయ్య తెలిపారు.ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లేదా విదేశాల నుంచి అక్కడి మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి తీసుకురావడం, కలిగి ఉండటం లేదా రవాణా చేయడం ఎక్సైజ్ చట్టం ప్రకారం నేరమని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ అనుమతితో నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండగా, బయట రాష్ట్రాల మద్యం కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని ప్రజలకు సూచించారు. బయట రాష్ట్రాల మద్యంతో ఎవరైనా పట్టుబడితే, సంబంధిత వ్యక్తులను అరెస్టు చేసి కేసులు నమోదు చేయడమే కాకుండా, మద్యం రవాణాకు ఉపయోగించిన వాహనాలను కూడా స్వాధీనం చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నేపథ్యంలో నూజివీడు స్టేషన్ పరిధిలోని నాలుగు మండలాల్లో ప్రత్యేక బృందాలతో రహదారులపై వాహనాల తనిఖీలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే ప్రైవేటు బస్సులు, టూరిస్ట్ బస్సులు, ప్రైవేట్ టాక్సీల యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డ్రైవర్లు, ప్రయాణికులు లేదా వారి బంధువులు ఎవరైనా ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లేదా విదేశీ మద్యం రవాణా చేస్తూ పట్టుబడితే, సంబంధిత వాహనాలపై కూడా కేసులు నమోదు చేసి స్వాధీనం చేసుకుంటామని ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News