Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 12:38 AM

నూతన సంవత్సరం వేళ సూర్యాపేటలో పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు

నూతన సంవత్సరం వేళ సూర్యాపేటలో పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు

నూతన సంవత్సరం వేళ సూర్యాపేటలో పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు
December 30, 2025 05:50 PM 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పోలీస్ హై సెక్యూరిటీ.. డ్రగ్స్, గంజాయి రవాణాపై విస్తృత తనిఖీలు

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలి – జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట: డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడంతో పాటు శాంతిభద్రతలు కాపాడే లక్ష్యంతో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్ ప్రాంగణాలు, రద్దీ ప్రాంతాలు, ఫ్లైఓవర్లు, ప్రధాన వాణిజ్య సముదాయాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

బస్సులు, బస్సు నిలుపుదల ప్రాంగణాలు, దుకాణాలు, ప్రయాణికుల లగేజీ, అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా పోలీస్ హై సెక్యూరిటీ విభాగం ఈ తనిఖీల్లో పాల్గొంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతున్న జాతీయ రహదారిపై ముఖ్య రవాణా కేంద్రంగా ఉన్న సూర్యాపేటలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం, గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం, కొత్త వ్యక్తుల కదలికలను గుర్తించడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

గుర్తింపు లేని వ్యక్తులకు లాడ్జీల్లో వసతి కల్పించవద్దని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. మాదకద్రవ్యాలు గుర్తించే డాగ్ స్క్వాడ్, పేలుడు పదార్థాలను గుర్తించే డాగ్స్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీల్లో పాల్గొని బస్సులు, అనుమానిత వస్తువులు, ప్రయాణికుల బ్యాగులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ అశోక, ఆర్ఎస్ఐ అన్వర్ రెహమాన్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News