Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యా ప్రగతికి నిదర్శనంగా మహిళా డిగ్రీ కళాశాల సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 05:10 AM

నూతన సంవత్సరం వేళ సూర్యాపేటలో పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు

నూతన సంవత్సరం వేళ సూర్యాపేటలో పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు

నూతన సంవత్సరం వేళ సూర్యాపేటలో పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు
December 30, 2025 05:50 PM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పోలీస్ హై సెక్యూరిటీ.. డ్రగ్స్, గంజాయి రవాణాపై విస్తృత తనిఖీలు

శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలి – జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

సూర్యాపేట: డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడంతో పాటు శాంతిభద్రతలు కాపాడే లక్ష్యంతో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్ ప్రాంగణాలు, రద్దీ ప్రాంతాలు, ఫ్లైఓవర్లు, ప్రధాన వాణిజ్య సముదాయాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.

బస్సులు, బస్సు నిలుపుదల ప్రాంగణాలు, దుకాణాలు, ప్రయాణికుల లగేజీ, అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా పోలీస్ హై సెక్యూరిటీ విభాగం ఈ తనిఖీల్లో పాల్గొంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతున్న జాతీయ రహదారిపై ముఖ్య రవాణా కేంద్రంగా ఉన్న సూర్యాపేటలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం, గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం, కొత్త వ్యక్తుల కదలికలను గుర్తించడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.

గుర్తింపు లేని వ్యక్తులకు లాడ్జీల్లో వసతి కల్పించవద్దని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. మాదకద్రవ్యాలు గుర్తించే డాగ్ స్క్వాడ్, పేలుడు పదార్థాలను గుర్తించే డాగ్స్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీల్లో పాల్గొని బస్సులు, అనుమానిత వస్తువులు, ప్రయాణికుల బ్యాగులను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ అశోక, ఆర్ఎస్ఐ అన్వర్ రెహమాన్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News