నూతన సంవత్సరం వేళ సూర్యాపేటలో పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు
నూతన సంవత్సరం వేళ సూర్యాపేటలో పోలీసుల కట్టుదిట్టమైన తనిఖీలు
Biksham
పోలీస్ హై సెక్యూరిటీ.. డ్రగ్స్, గంజాయి రవాణాపై విస్తృత తనిఖీలు
శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు సహకరించాలి – జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
సూర్యాపేట: డిసెంబర్ 31, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడంతో పాటు శాంతిభద్రతలు కాపాడే లక్ష్యంతో జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కొత్త బస్టాండ్, హైటెక్ బస్టాండ్ ప్రాంగణాలు, రద్దీ ప్రాంతాలు, ఫ్లైఓవర్లు, ప్రధాన వాణిజ్య సముదాయాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
బస్సులు, బస్సు నిలుపుదల ప్రాంగణాలు, దుకాణాలు, ప్రయాణికుల లగేజీ, అనుమానిత వ్యక్తులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జిల్లా పోలీస్ హై సెక్యూరిటీ విభాగం ఈ తనిఖీల్లో పాల్గొంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతున్న జాతీయ రహదారిపై ముఖ్య రవాణా కేంద్రంగా ఉన్న సూర్యాపేటలో భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం, గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించడం, కొత్త వ్యక్తుల కదలికలను గుర్తించడం ఈ తనిఖీల ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు.
గుర్తింపు లేని వ్యక్తులకు లాడ్జీల్లో వసతి కల్పించవద్దని, శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు. మాదకద్రవ్యాలు గుర్తించే డాగ్ స్క్వాడ్, పేలుడు పదార్థాలను గుర్తించే డాగ్స్, బాంబ్ స్క్వాడ్ సిబ్బంది తనిఖీల్లో పాల్గొని బస్సులు, అనుమానిత వస్తువులు, ప్రయాణికుల బ్యాగులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఐ అశోక, ఆర్ఎస్ఐ అన్వర్ రెహమాన్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి