నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు తప్పనిసరి: ఎస్పీ నరసింహ
నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు తప్పనిసరి: ఎస్పీ నరసింహ
Biksham
నూతన సంవత్సరం వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలన్న ఎస్పీ నరసింహ
రోడ్లపై ర్యాలీలు, హంగామా, కేక్ కటింగ్కు అనుమతి లేదు
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనానికి నిషేధం
సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం
నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ప్రజలకు సూచించారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో సాయంత్రం 6 గంటల నుంచే వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్లు, క్లబ్లు, గేటెడ్ కమ్యూనిటీల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించరాదన్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేలా క్రాకర్స్ పేల్చడం, అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే మైనర్తో పాటు వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని, త్రిబుల్ రైడింగ్, పెద్ద శబ్దాలు చేసే సైలెన్సర్లతో వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. గుంపులు గుంపులుగా రోడ్లపై హంగామా చేయడం, వాహన ర్యాలీలు, రోడ్లపై కేక్ కటింగ్కు అనుమతి లేదన్నారు. కుటుంబ సభ్యులతో ఇంట్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని ప్రజలను కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి