Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:47 PM

నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు తప్పనిసరి: ఎస్పీ నరసింహ

నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు తప్పనిసరి: ఎస్పీ నరసింహ

నూతన సంవత్సర వేడుకల్లో నిబంధనలు తప్పనిసరి: ఎస్పీ నరసింహ
December 29, 2025 11:46 AM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

నూతన సంవత్సరం వేడుకలను శాంతియుతంగా నిర్వహించాలన్న ఎస్పీ నరసింహ

రోడ్లపై ర్యాలీలు, హంగామా, కేక్ కటింగ్‌కు అనుమతి లేదు

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనానికి నిషేధం

సూర్యాపేట స్థానికం ప్రతినిధి బిక్షం

నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించుకోవాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ప్రజలకు సూచించారు. ప్రభుత్వం విధించిన నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో సాయంత్రం 6 గంటల నుంచే వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నిషేధమని స్పష్టం చేశారు. ఫామ్ హౌస్‌లు, క్లబ్‌లు, గేటెడ్ కమ్యూనిటీల్లో అనుమతి లేకుండా వేడుకలు నిర్వహించరాదన్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేలా క్రాకర్స్ పేల్చడం, అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేయడం పూర్తిగా నిషేధమని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే మైనర్‌తో పాటు వాహన యజమానిపై కేసులు నమోదు చేస్తామని, త్రిబుల్ రైడింగ్‌, పెద్ద శబ్దాలు చేసే సైలెన్సర్లతో వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. గుంపులు గుంపులుగా రోడ్లపై హంగామా చేయడం, వాహన ర్యాలీలు, రోడ్లపై కేక్ కటింగ్‌కు అనుమతి లేదన్నారు. కుటుంబ సభ్యులతో ఇంట్లోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, పోలీస్ శాఖకు సహకరించాలని ప్రజలను కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News