నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సుధాకర్ పివిసి మేనేజింగ్ డైరక్టర్ మీలా మహదేవ్
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన సుధాకర్ పివిసి మేనేజింగ్ డైరక్టర్ మీలా మహదేవ్
Biksham
సూర్యాపేట స్థానికంబిక్షం
నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్లో సుధాకర్ పీవీసీ మేనేజింగ్ డైరెక్టర్ మీలా మహదేవ్ ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఏఐసీసీ నాయకులు రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పోతు భాస్కర్లను కలిసిన మీలా మహదేవ్ వారికి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు క్యాలండర్, డైరీ, గిఫ్ట్ బాక్స్లను అందజేశారు.
ఈ భేటీ సందర్భంగా నూతన సంవత్సరంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం కావాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో సుధా బ్యాంకు వైస్ చైర్మన్ కక్కిరేణి చంద్రశేఖర్, పీవీఎస్ శర్మతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి