నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం
నారాయణఖేడ్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం
Reporter Sangameshwar Reddy
నారాయణఖేడ్ / సంగారెడ్డి జిల్లా:
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో ఉన్న మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాల–1లో 2026–27 విద్యాసంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి.
మైనారిటీ విద్యార్థులకు ప్రత్యక్ష ప్రవేశ విధానంలో అడ్మిషన్లు కొనసాగుతున్నట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. మైనారిటీ సీట్లకు ఆన్లైన్ ప్రవేశ పరీక్ష లేకుండా నేరుగా అడ్మిషన్ తీసుకునే అవకాశం కల్పించినట్లుపేర్కొన్నారు.
అలాగే మైనారిటీేతర విద్యార్థులు (SC, ST, BC, OC) దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని, లక్కీ డిప్ ద్వారా ఎంపిక జరుగుతుందని అధికారులు
తెలిపారు.5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు MPC, Bi.PC గ్రూపుల్లో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ పాఠశాలలో ఉచిత విద్య అందించడంతో పాటు ఎలాంటి రుసుములు లేవని, ప్రవేశ పరీక్ష అవసరం లేదని వివరించారు.
విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, నాణ్యమైన విద్య అందించడంతో పాటు గత విద్యాసంవత్సరాల్లో 100 శాతం ఫలితాలు సాధించినట్లు పాఠశాల యాజమాన్యం వెల్లడించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి