Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డ్రైవర్ అశోక్‌కు క్లీన్చిట్” ప్రభుత్వం వెనక్కి.. సస్పెన్షన్ చర్యలు లేవన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 08:53 PM

నారాయణఖేడ్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర

నారాయణఖేడ్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర

నారాయణఖేడ్ జడ్పీహెచ్ఎస్ విద్యార్థుల విజ్ఞాన విహారయాత్ర
January 23, 2026 04:59 PM 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ

జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నారాయణఖేడ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు విజ్ఞాన విహారయాత్ర నిర్వహించబడింది. ప్రధానమంత్రి శ్రీ పథకం లో భాగంగా, జడ్పీహెచ్ఎస్ నారాయణఖేడ్ పాఠశాలలో చదువుతున్న ఎనిమిదవ, తొమ్మిదవ, పదవ తరగతుల విద్యార్థులను ఈరోజు కంది లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థకు తీసుకెళ్లడం జరిగింది.ఈ విజ్ఞాన విహారయాత్ర ద్వారా విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యా సంస్థలను ప్రత్యక్షంగా సందర్శించి, అక్కడి విద్యా విధానాలు, పరిశోధనల గురించి అవగాహన పెంపొందించుకున్నారు. విద్యార్థులలో శాస్త్రీయ దృక్పథం, నూతన ఆలోచనలకు ప్రోత్సాహం కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మన్మధ కిషోర్ తెలిపారు.మరో విడతలో మరికొంతమంది విద్యార్థులను కూడా ఇలాంటి విజ్ఞాన విహారయాత్రలకు తీసుకెళ్లే ప్రణాళిక ఉందని ఆయన తెలిపారు. విజ్ఞాన విహారయాత్రలతో పాటు రాబోయే రోజుల్లో క్షేత్ర సందర్శనలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే వారి భవిష్యత్ లక్ష్యాలకు ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.ప్రస్తుత కాలంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నూతన సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక విజ్ఞానాన్ని విద్యార్థులు అందిపుచ్చుకుని పోటీ ప్రపంచంలో ముందంజలో నిలవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు యాదగిరి, అశోక్ గౌడ్, రాజశేఖర్, చంద్రశేఖర్ ఆచార్య, గురునాథ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News