Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 02:37 AM

నారాయణ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్‌కు డీఎస్‌ఎఫ్ వినతి.

నారాయణ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్‌కు డీఎస్‌ఎఫ్ వినతి.

నారాయణ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి కలెక్టర్‌కు డీఎస్‌ఎఫ్ వినతి.
June 01, 2026 05:47 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని,: ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సెలవు దినాల్లో ఉపాధ్యాయులతో పని చేయించడంతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆదోని నారాయణ పాఠశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డెమొక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ (డీఎస్‌ఎఫ్) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కర్నూలు జిల్లా కలెక్టర్ సిరికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ.. ఆదోని పట్టణంలోని నారాయణ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ సెలవు దినాల్లో కూడా అడ్మిషన్ల పేరుతో ఉపాధ్యాయులతో ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సరైన ధ్రువపత్రాలు లేకుండానే ఆధార్ కార్డుల ఆధారంగా అడ్మిషన్లు చేపడుతున్నారని పేర్కొన్నారు.

పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, బూట్లు, టెక్నో కోర్సులు, ఒలింపియాడ్ పరీక్షల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను ఆకర్షించి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో సాధించిన ర్యాంకులను తమ పాఠశాల ర్యాంకులుగా ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజుల పట్టికను ప్రదర్శించకుండా ర్యాంకుల పేరుతో ప్రచారం నిర్వహించడం ద్వారా విద్యను వ్యాపార వస్తువుగా మార్చారని అన్నారు. విద్యా హక్కు చట్టం ఉద్దేశాలను దెబ్బతీస్తున్న ఇటువంటి చర్యలపై ఉన్నత విద్యాశాఖ అధికారులు విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

లేని పక్షంలో నారాయణ పాఠశాల ఎదుట, విద్యాశాఖ కార్యాలయాల ముందు దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News