నరసింహులగూడెం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి....
నరసింహులగూడెం గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి....
Harish HS
జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన సర్పంచ్ కుంచం ఇందిర నరసయ్య....
మునగాల మండలం నరసింహుల గూడెం గ్రామంలో రైతులు సుమారు 400 ఎకరాలలో విస్తీర్ణంలో సాగు చేసిన మొక్కజొన్న పంటకు వర్షాలు బారిన నష్టపోకుండా రైతులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని గ్రామంలో ఏర్పాటు చేయాలని నరసింహుల గూడెం సర్పంచ్ కుంచం ఇందిర నరసయ్య ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ను వారి కార్యాలయంలో కలిసి రైతులతోపాటు కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే మార్క్ ఫెయిడ్ ఎండి తో మాట్లాడి రెండు మూడు రోజుల్లో గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. సందర్భంగా కలెక్టర్
రెండు మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు వరికి ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్న పండిస్తున్న నరసింహుల గూడెం రైతులను కలెక్టర్ అభినందించారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మొగిలి చర్ల సీతారాములు, మాజీ సర్పంచ్ జూలకంటి కొండారెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి, వార్డు మెంబర్ మొగిలిచర్ల రమేష్, రైతులు షేక్ దస్తగిరి, ఎస్.కె సైదా, గొల్లపూడి వీరబాబు జూలకంటి రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు....

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి