Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:04 PM

నరసింహారావుపాలెం లో ఎరువుల కొరత లేదు కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేయడమే లక్ష్యం మంత్రి కొలుసు పార్థసారథి

నరసింహారావుపాలెం లో ఎరువుల కొరత లేదు కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేయడమే లక్ష్యం మంత్రి కొలుసు పార్థసారథి

నరసింహారావుపాలెం లో ఎరువుల కొరత లేదు కావాలని బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కూటమి ప్రభుత్వంలో రైతులకు న్యాయం చేయడమే లక్ష్యం మంత్రి కొలుసు పార్థసారథి
January 14, 2026 07:26 AM 89 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నరసింహారావుపాలెం లో ఎరువుల కొరత లేదు


వైసిపి వారు కావాలని కూటమి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు


చాట్రాయి, జనవరి 13, స్థానికం న్యూస్ ఏపీ స్టేట్ బ్యూరో గడ్డం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేనే లేదని రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు చాట్రాయి మండలం నరసింహరావుపాలెం లోని ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాల గోడౌన్ ను, ఎరువుల దుకాణాలను మంత్రి మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోడౌన్లలో ఉన్న ఎరువుల నిల్వలు, రిజిస్టర్లను మంత్రి వరిశీలించారు. అక్కడకు వచ్చిన రైతులను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో జనవరి నెలకు 38,148 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం కాగా, 45 వేల 334 మెట్రిక్ టన్నులు మార్కెఫెడ్, ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ప్రైవేట్ డీలర్లు, హెూల్ సేల్ వ్యాపారుల వద్ద అందుబాటులో ఉంచామన్నారు. నరసింహరావుపాలెం లో రైతులకు అవసరాలకు సరివడిన ఎరువుల నిల్వలు ఉన్నాయని, ఇంకా అవసరమైతే ఎరువులను అందుబాటులోకి తీసుకువస్తామని, ఎరువుల విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు. కొందరు కావాలని ఎరువుల కొరత ఉందని వదంతులను సృష్టిస్తున్నారని, రైతులు వాటిని నమ్మవద్దన్నారు. రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం వనిచేస్తుందని, రైతుల సమస్యలను ముందుగానే తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందు ఉ ఉంటుందన్నారు. జిల్లాలో ఎటువంటి ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకోమని వ్యవసాయ, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించడం జరిగిందని, అధికారులు కూడా 10 రోజులకు సరిపడా ఎరువుల నిల్వలను ఉంచుతూ, ఎక్కడైనా ఎరువుల కొరతను ముందుగానే గుర్తించి అక్కడకు వెంటనే ఎరువులను సరఫరా చేస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఎరువులను మంత్రి స్వయంగా రైతులకు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ హబీబ్ భాషా, మండల వ్యవసాయ అధికారి శివశంకర్, తహశీల్దార్ బి బిల్లు, డిప్యూటీ తహశీల్దార్ బి.ఈశ్వర్, ఎంపీడీవో సత్యనారాయణ, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరరావు, నరసింహారావుపాలెం సహకార సంఘం అధ్యక్షులు కట్టా నాగ దుర్గా రావు, చనుబండ సహకార సంఘం అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు,పోలవరం సహకార సంఘం అధ్యక్షులు యర్రా ప్రసాద రావు, సీనియర్ నాయకులు మందపాటి బసవా రెడ్డి, అత్తులూరి శ్రీనివాస రావు, పుచ్చకాయల నోబుల్ రెడ్డి, పలగాని దుర్గారావు, కలకొండ భాస్కరరావు,మాదాసు చిన్న పుల్లయ్య,చీదిరాల మారేశ్వ‌‌‌రావు, కందుల కృష్ణ, తల్లాడ శ్రీనివాసరావు,కాలసాని సూర్య నారాయణ,రాజబోయిన దశరధ రామరాజు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News