నార్కట్ పల్లి గ్రామపంచాయతీలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం సందర్భంగా గ్రామ సభ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ పాల్గొని గ్రామ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నివారణతో పాటు ఘటనల త్వరిత గుర్తింపుకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అమలు చేస్తున్న “అలైవ్ & అరైవ్” కార్యక్రమం ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.
సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ, ఓటీపీలు, బ్యాంక్ వివరాలు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. పోలీసింగ్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని, గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సీఐ, ఎస్సై, గ్రామ సర్పంచ్, పోలీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి