నార్కట్ పల్లి లిఫ్ట్ ముసుగులో దోపిడి ఇద్దరి అరెస్ట్
నార్కట్ పల్లి లిఫ్ట్ ముసుగులో దోపిడి ఇద్దరి అరెస్ట్
Komidala Mahender reddy
నార్కట్పల్లి పరిధిలో లిఫ్ట్ ఇస్తామని మోసం చేసి లారీ డ్రైవర్ను బెదిరించి ఫోన్ దోచుకున్న ఘటనలో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.ఈ నెల 3న ఉత్తరప్రదేశ్కు చెందిన లారీ డ్రైవర్ సునీల్ తివారి ఏపీ లింగోటం వద్ద కిరాణా షాపుకు వెళ్తున్న సమయంలో స్కూటీపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు లిఫ్ట్ ఇస్తామని మాటిచ్చారు. వారి మాటలు నమ్మిన డ్రైవర్ స్కూటీపై ఎక్కగానే, శ్రీనివాస టౌన్షిప్ సమీపానికి చేరుకున్న వెంటనే ఇనుప రాడ్డుతో బెదిరించారు. అనంతరం అతని వద్ద ఉన్న మొబైల్ ఫోన్ను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు.బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నార్కట్పల్లి ఎస్సై విష్ణుమూర్తి ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరా ఫుటేజ్, కాల్ డేటా ఆధారంగా నిందితులు లింగస్వామి, ఎస్కే ఉమర్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం వారిని న్యాయస్థానంలో హాజరుపర్చగా రిమాండ్కు తరలించారు.
ప్రజలు అపరిచితుల లిఫ్ట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రాంతంలో శాంతిభద్రతలు కట్టుదిట్టం చేసినట్లు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి