నూతన సర్పంచులకు తెలుగుదేశం పార్టీ ఘన సన్మానం
నూతన సర్పంచులకు తెలుగుదేశం పార్టీ ఘన సన్మానం
స్థానికం బృందం
స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్
రామన్నపేట మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచులను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బుధవారం ఉదయం కొమ్మాయిగూడెం గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, నీర్నాముల గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేష్, పల్లివాడ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్లను వారి స్వగృహాల వద్దకు వెళ్లి పార్టీ నేతలు సన్మానించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ, గ్రామాభివృద్ధిని ప్రథమ కర్తవ్యంగా తీసుకుని రామన్నపేట మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నూతన సర్పంచులకు నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎండి పజల్ బ్రేగ్తో పాటు పార్టీ నాయకులు బత్తుల సత్తయ్య, నకిరేకంటి గణేష్, దండిగల రాములు, పోచబోయిన మల్లేశం, శ్రీశైలం, విజేందర్ తదితరులు పాల్గొని సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
రామన్నపేట మండలంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచులను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా బుధవారం ఉదయం కొమ్మాయిగూడెం గ్రామ సర్పంచ్ మల్లారెడ్డి, నీర్నాముల గ్రామ సర్పంచ్ గోపాల్ రెడ్డి, మునిపంపుల గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి వెంకటేష్, పల్లివాడ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్లను వారి స్వగృహాల వద్దకు వెళ్లి పార్టీ నేతలు సన్మానించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ, గ్రామాభివృద్ధిని ప్రథమ కర్తవ్యంగా తీసుకుని రామన్నపేట మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నూతన సర్పంచులకు నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఎండి పజల్ బ్రేగ్తో పాటు పార్టీ నాయకులు బత్తుల సత్తయ్య, నకిరేకంటి గణేష్, దండిగల రాములు, పోచబోయిన మల్లేశం, శ్రీశైలం, విజేందర్ తదితరులు పాల్గొని సర్పంచులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి