నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి* *జిల్లా కలెక్టర్ హనుమంతు రావు*
నూతన సంవత్సరంలో ప్రజలందరూ సంతోషంగా ఉండాలి* *జిల్లా కలెక్టర్ హనుమంతు రావు*
Editor Desk
యాదాద్రి భువనగిరి స్థానికం రిపోర్టర్ వెంకటేష్
2026 నూతన సంవత్సరం లో ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, జిల్లా లో పాడి పంటలు సమృద్ధిగా పండాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతు రావు కోరారు. శుక్రవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన సీనియర్ న్యాయవాది నాగారం అంజయ్య, ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, రిటైర్డ్ ఉద్యోగి నల్ల కృష్ణ, సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ లతో కలెక్టర్ ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు.ఈ సందర్భంగా అందజేసిన "మినీ భారత రాజ్యాంగ పుస్తకం", "భువనగిరి జిల్లా చరిత్రను" తెలిపే పుస్తకాలను కలెక్టర్ ఆసక్తి గా చూసారు. భువనగిరి చరిత్ర కు సంబంధించిన "భువన విజయం" పుస్తకం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతు రావు శుభాకాంక్షలు తెలిపిన వారందరినీ పేరు పేరునా పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి