నూతన సంవత్సర వేళ శుభాకాంక్షలు… నాయకుల భేటీ, దేవాలయంలో ప్రత్యేక పూజలు
నూతన సంవత్సర వేళ శుభాకాంక్షలు… నాయకుల భేటీ, దేవాలయంలో ప్రత్యేక పూజలు
Editor Desk
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, నకిరేకల్, చిట్యాల కేంద్రంగా పలు కార్యక్రమాలు జరిగాయి.
నూతన సంవత్సర సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో కొత్త ఏడాది ఆరంభమవుతుందని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.
అదే విధంగా చిట్యాల లోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజలు ఆనందంగా, సంతోషంగా, శాంతియుతంగా జీవించాలంటూ అమ్మవారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, ఉరుమడ్ల మాజీ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య గౌడ్, గ్రామ వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, మేడబోయిన స్వాతి శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలగొని నరసింహ గౌడ్, పోలగొని నరేష్ కుమార్ గౌడ్, డాక్టర్ పోలగొని రాజేష్ గౌడ్, గుత్తా రవీందర్ రెడ్డి, పల్లపు రామకృష్ణ పాల్గొన్నారు.
అలాగే కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు జన్నపాల రాము, పెండల ప్రభు కుమార్, పోలగొని దేవిశ్రీ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి