Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఈసారి గోవధ వద్దు..! సామరస్యమే అసలైన ఖుర్బానీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 09:43 PM

నూతన సంవత్సర వేళ శుభాకాంక్షలు… నాయకుల భేటీ, దేవాలయంలో ప్రత్యేక పూజలు

నూతన సంవత్సర వేళ శుభాకాంక్షలు… నాయకుల భేటీ, దేవాలయంలో ప్రత్యేక పూజలు

నూతన సంవత్సర వేళ శుభాకాంక్షలు… నాయకుల భేటీ, దేవాలయంలో ప్రత్యేక పూజలు
January 01, 2026 06:18 PM 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
చిట్యాల స్థానికం ప్రతినిధి కొమ్మిడాల మహేందర్ రెడ్డి

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని హైదరాబాద్, నకిరేకల్, చిట్యాల కేంద్రంగా పలు కార్యక్రమాలు జరిగాయి.

నూతన సంవత్సర సందర్భంగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో కొత్త ఏడాది ఆరంభమవుతుందని ఈ సందర్భంగా నాయకులు ఆకాంక్షించారు.

అదే విధంగా చిట్యాల లోని శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి దేవాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రాంత ప్రజలు ఆనందంగా, సంతోషంగా, శాంతియుతంగా జీవించాలంటూ అమ్మవారిని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పల్లపు బుద్ధుడు, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, ఉరుమడ్ల మాజీ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య గౌడ్, గ్రామ వార్డు సభ్యులు జన్నపాల శ్రీను, మేడబోయిన స్వాతి శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోలగొని నరసింహ గౌడ్, పోలగొని నరేష్ కుమార్ గౌడ్, డాక్టర్ పోలగొని రాజేష్ గౌడ్, గుత్తా రవీందర్ రెడ్డి, పల్లపు రామకృష్ణ పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు జన్నపాల రాము, పెండల ప్రభు కుమార్, పోలగొని దేవిశ్రీ ప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News