నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పబ్లను తనిఖీ చేసిన కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పబ్లను తనిఖీ చేసిన కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి
స్థానికం బృందం
మల్కాజిగిరి స్థానికం రిపోర్టర్
నూతన సంవత్సర వేడుకలను శాంతియుతంగా, చట్టబద్ధంగా నిర్వహించాలనే ఉద్దేశంతో కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి శుక్రవారం నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పబ్ లను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా నేరేడ్మెట్ పరిధిలో ఉన్న బ్యారాక్స్ అండ్ యాంటీ రూమ్, హౌస్ పార్టీ, 10D పబ్లను ఆయన పరిశీలించారు. పబ్ మేనేజ్మెంట్లతో మాట్లాడిన ఏసీపీ వెంకట్ రెడ్డి, నూతన సంవత్సర వేడుకలు డ్రగ్స్ ఫ్రీ ఈవెంట్గా నిర్వహించాలని స్పష్టంగా సూచించారు.
అలాగే పబ్లకు వచ్చే వాహనాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలని, ఎలాంటి పరిస్థితుల్లోనూ మైనర్లకు మద్యం విక్రయించకూడదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పబ్ యాజమాన్యాలకు ఆయన స్పష్టం చేశారు.
ఈ తనిఖీ కార్యక్రమంలో నేరేడ్మెట్ ఇన్స్పెక్టర్తో పాటు ఎస్ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు. నూతన సంవత్సర వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని నేరేడ్మెట్ పోలీసులు ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి