రామన్నపేట స్థానిక ప్రతినిధి:
యాదాద్రి భువనగిరి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అక్షాంష్ యాదవ్ను రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామ బీఆర్ఎస్ వార్డు సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముద్రబోయిన శ్రీశైలం, నడిగోటి నరేష్, కన్నెబోయిన మంగ వెంకటేశ్వర్లు, బుర్ర నాగేష్లు ఎస్పీకి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.జిల్లాలో శాంతిభద్రతలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తూ, ప్రజలకు భద్రతతో కూడిన పోలీసింగ్ అందించాలని కోరారు. ప్రజలతో పోలీసులకు మధ్య సమన్వయం మరింత బలపడాలని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి