నమ్మకాన్ని నిలబెట్టిన నూర్ మహ్మద్ – పోలీసుల ప్రశంసలు
నమ్మకాన్ని నిలబెట్టిన నూర్ మహ్మద్ – పోలీసుల ప్రశంసలు
EDIGA NAVEENKUMAR
సోమందేపల్లి మండలానికి చెందిన కృష్ణబాయి (63), భర్త లక్ష్మన్న , బెంగళూరు నుండి సోమందేపల్లికి “సీపీసీ“ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో తన పర్సును అనుకోకుండా పోగొట్టుకున్నారు.
అదే బస్సులో హిందూపురం నుండి పెనుకొండకు ప్రయాణిస్తున్న నూర్ మహ్మద్ (35), తండ్రి ఉబేదుల్లా, నివాసం పెనుకొండ, ఆ పర్సును కనుగొని తన నిజాయితీని చాటుకున్నారు.
ఆ పర్సులో సుమారు 13 గ్రాముల బంగారు నెక్లెస్ (అంచనా విలువ రూ.1,90,000/-)తో పాటు రూ.2,000/- నగదు ఉన్నాయి. నూర్ మహ్మద్ వెంటనే బస్సు డ్రైవర్ అహద్ఖాన్ కి సమాచారం అందించి, తన ఫోన్ నంబర్ ఇచ్చారు.
శుక్రవారం కృష్ణబాయి సోమందేపల్లి పోలీస్ స్టేషన్ను సంప్రదించగా, ఎస్.ఐ జి. సుధాకర్ యాదవ్ బస్సు డ్రైవర్ ద్వారా నూర్ మహ్మద్ను సంప్రదించారు. అనంతరం నూర్ మహ్మద్ స్టేషన్కు వచ్చి, పర్సులోని అన్ని వస్తువులను యథావిధిగా కృష్ణబాయి కి అప్పగించారు.
నూర్ మహ్మద్ నిజాయితీని అభినందించిన ఎస్.ఐ జి. సుధాకర్ యాదవ్, ఆయనను శ్శాలువ మరియు పూలహారంతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎస్.ఐ మాట్లాడుతూ,
“సమాజంలో ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులు ఉండటం గర్వకారణం. నూర్ మహ్మద్ చర్యలు అందరికీ ఆదర్శం” అని పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి