Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:00 AM

నమ్మకాన్ని నిలబెట్టిన నూర్ మహ్మద్ – పోలీసుల ప్రశంసలు

నమ్మకాన్ని నిలబెట్టిన నూర్ మహ్మద్ – పోలీసుల ప్రశంసలు

నమ్మకాన్ని నిలబెట్టిన నూర్ మహ్మద్ – పోలీసుల ప్రశంసలు
10-04-2026 97 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి మండలానికి చెందిన కృష్ణబాయి (63), భర్త లక్ష్మన్న , బెంగళూరు నుండి సోమందేపల్లికి “సీపీసీ“ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో తన పర్సును అనుకోకుండా పోగొట్టుకున్నారు.

అదే బస్సులో హిందూపురం నుండి పెనుకొండకు ప్రయాణిస్తున్న నూర్ మహ్మద్ (35), తండ్రి ఉబేదుల్లా, నివాసం పెనుకొండ, ఆ పర్సును కనుగొని తన నిజాయితీని చాటుకున్నారు.

ఆ పర్సులో సుమారు 13 గ్రాముల బంగారు నెక్లెస్ (అంచనా విలువ రూ.1,90,000/-)తో పాటు రూ.2,000/- నగదు ఉన్నాయి. నూర్ మహ్మద్ వెంటనే బస్సు డ్రైవర్ అహద్ఖాన్ కి సమాచారం అందించి, తన ఫోన్ నంబర్ ఇచ్చారు.

శుక్రవారం కృష్ణబాయి సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగా, ఎస్‌.ఐ జి. సుధాకర్ యాదవ్ బస్సు డ్రైవర్ ద్వారా నూర్ మహ్మద్‌ను సంప్రదించారు. అనంతరం నూర్ మహ్మద్ స్టేషన్‌కు వచ్చి, పర్సులోని అన్ని వస్తువులను యథావిధిగా కృష్ణబాయి కి అప్పగించారు.

నూర్ మహ్మద్ నిజాయితీని అభినందించిన ఎస్‌.ఐ జి. సుధాకర్ యాదవ్, ఆయనను శ్శాలువ మరియు పూలహారంతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఎస్‌.ఐ మాట్లాడుతూ,

“సమాజంలో ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులు ఉండటం గర్వకారణం. నూర్ మహ్మద్ చర్యలు అందరికీ ఆదర్శం” అని పేర్కొన్నారు.


Sthanikam

నమ్మకాన్ని నిలబెట్టిన నూర్ మహ్మద్ – పోలీసుల ప్రశంసలు

Article Image

సోమందేపల్లి మండలానికి చెందిన కృష్ణబాయి (63), భర్త లక్ష్మన్న , బెంగళూరు నుండి సోమందేపల్లికి “సీపీసీ“ బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో తన పర్సును అనుకోకుండా పోగొట్టుకున్నారు.

అదే బస్సులో హిందూపురం నుండి పెనుకొండకు ప్రయాణిస్తున్న నూర్ మహ్మద్ (35), తండ్రి ఉబేదుల్లా, నివాసం పెనుకొండ, ఆ పర్సును కనుగొని తన నిజాయితీని చాటుకున్నారు.

ఆ పర్సులో సుమారు 13 గ్రాముల బంగారు నెక్లెస్ (అంచనా విలువ రూ.1,90,000/-)తో పాటు రూ.2,000/- నగదు ఉన్నాయి. నూర్ మహ్మద్ వెంటనే బస్సు డ్రైవర్ అహద్ఖాన్ కి సమాచారం అందించి, తన ఫోన్ నంబర్ ఇచ్చారు.

శుక్రవారం కృష్ణబాయి సోమందేపల్లి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించగా, ఎస్‌.ఐ జి. సుధాకర్ యాదవ్ బస్సు డ్రైవర్ ద్వారా నూర్ మహ్మద్‌ను సంప్రదించారు. అనంతరం నూర్ మహ్మద్ స్టేషన్‌కు వచ్చి, పర్సులోని అన్ని వస్తువులను యథావిధిగా కృష్ణబాయి కి అప్పగించారు.

నూర్ మహ్మద్ నిజాయితీని అభినందించిన ఎస్‌.ఐ జి. సుధాకర్ యాదవ్, ఆయనను శ్శాలువ మరియు పూలహారంతో సత్కరించారు.

ఈ సందర్భంగా ఎస్‌.ఐ మాట్లాడుతూ,

“సమాజంలో ఇలాంటి నిజాయితీ గల వ్యక్తులు ఉండటం గర్వకారణం. నూర్ మహ్మద్ చర్యలు అందరికీ ఆదర్శం” అని పేర్కొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News