నామకరణ మహోత్సవంలో పాల్గొన్న: వై. పండరి, డి. ఓం ప్రకాష్
నామకరణ మహోత్సవంలో పాల్గొన్న: వై. పండరి, డి. ఓం ప్రకాష్
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలో నాగల్గిద్ది మండల పరిధిలోని ఊట్పల్లి గ్రామంలో నరసింహారెడ్డి & లావణ్య దంపతుల కుమార్తెకు నిర్వహించిన నామకరణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ పెద్దలు, బంధువులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై చిన్నారి భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ శుభకార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వైస్ చైర్మన్ వై. పండరి, రాష్ట్ర ఉత్తమ రక్తదాత అవార్డు గ్రహీత డాక్టర్ డి. ఓం ప్రకాష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే యువ నాయకులు జమీర్, తిమ్మా పూరే, సుభాష్ తదితరులు కూడా హాజరై చిన్నారిని ఆశీర్వదించి, తల్లిదండ్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ, కుటుంబానికి ఈ చిన్నారి మరింత ఆనందాన్ని తీసుకురావాలని, మంచి విద్య, మంచి విలువలతో ఎదిగి సమాజానికి ఉపయోగపడే వ్యక్తిగా మారాలని ఆకాంక్షించారు. కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో, ఆనందోత్సాహాల మధ్య సజావుగా జరిగింది.గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నరసింహారెడ్డి & లావణ్య దంపతులను అభినందిస్తూ, చిన్నారికి దీర్ఘాయుష్షు, ఆరోగ్యం, సుఖసంతోషాలు కలగాలని కోరుకున్నార

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి