Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:26 PM

నాలుగో వార్డ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

నాలుగో వార్డ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

నాలుగో వార్డ్  అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం
February 07, 2026 11:26 AM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

నాలుగో వార్డ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

కోదాడ మున్సిపల్ పరిధిలోని 4 వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి మీ సేవకుడిగా ‌కృషి చేస్తాడని ఆశీర్వదించి చెయ్యి (హస్తం) గుర్తుపై ఓటు వేసి అఖండ ఓట్ల మెజార్టీతో గెలిపించాలని 4 వ వార్డు ఇంచార్జ్ బాణాల నాగరాజు అన్నారు. శనివారం నాలుగో వార్డులో ప్రచారంలో భాగంగా కౌన్సిలర్ అభ్యర్థి సుల్తాని సుజాత రాంబాబు గ్రామ అధ్యక్షులు షేక్ సోంద్ మియా, గ్రామ పెద్దలతో కలిసి నాగరాజు గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వార్డులోని అనేక సమస్యలను పరిష్కరించామని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో వార్డులోని డ్రైనేజీ వ్యవస్థ అనేక సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. వార్డు ప్రజలు చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి వార్డుని అభివృద్ధి చేస్తానని తెలిపారు. 4 వ వార్డ్ లో ఉన్న అనేక మౌలిక సదుపాయాలు వార్డు పరిశుభ్రత, మంచినీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజ్ ,నూతన సిసి రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి వార్డు అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు చెయ్యి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎండి నన్నేసాహెబ్, కోదాటి వెంకటేశ్వర్లు, కమ్మతం వెంకటయ్య, మాతంగి ప్రసాద్, బత్తినేని శ్రీనివాసరావు, తుమాట రామయ్య, ఏలూరు నాగయ్య, మాతంగి సురేష్, కోదాటి రామారావు, నిడిగొండ కనకయ్య, రంగారెడ్డి, కాసులు, మున్న, కోటేశ్వరరావు, వెంకన్న, పెద రోశయ్య, బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News