Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
Community Power for Health: Walkathon Sparks Preventive Care Movement సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 01:48 PM

నాలుగో వార్డ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

నాలుగో వార్డ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

నాలుగో వార్డ్  అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం
February 07, 2026 11:26 AM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish HS

నాలుగో వార్డ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం

కోదాడ మున్సిపల్ పరిధిలోని 4 వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి మీ సేవకుడిగా ‌కృషి చేస్తాడని ఆశీర్వదించి చెయ్యి (హస్తం) గుర్తుపై ఓటు వేసి అఖండ ఓట్ల మెజార్టీతో గెలిపించాలని 4 వ వార్డు ఇంచార్జ్ బాణాల నాగరాజు అన్నారు. శనివారం నాలుగో వార్డులో ప్రచారంలో భాగంగా కౌన్సిలర్ అభ్యర్థి సుల్తాని సుజాత రాంబాబు గ్రామ అధ్యక్షులు షేక్ సోంద్ మియా, గ్రామ పెద్దలతో కలిసి నాగరాజు గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వార్డులోని అనేక సమస్యలను పరిష్కరించామని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో వార్డులోని డ్రైనేజీ వ్యవస్థ అనేక సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. వార్డు ప్రజలు చెయ్యి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సామినేని ప్రమీల రమేష్ సహకారంతో పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి వార్డుని అభివృద్ధి చేస్తానని తెలిపారు. 4 వ వార్డ్ లో ఉన్న అనేక మౌలిక సదుపాయాలు వార్డు పరిశుభ్రత, మంచినీటి సరఫరా, విద్యుత్, డ్రైనేజ్ ,నూతన సిసి రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి వార్డు అభివృద్ధి చేసి ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కావున ప్రతి ఒక్కరు చెయ్యి గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎండి నన్నేసాహెబ్, కోదాటి వెంకటేశ్వర్లు, కమ్మతం వెంకటయ్య, మాతంగి ప్రసాద్, బత్తినేని శ్రీనివాసరావు, తుమాట రామయ్య, ఏలూరు నాగయ్య, మాతంగి సురేష్, కోదాటి రామారావు, నిడిగొండ కనకయ్య, రంగారెడ్డి, కాసులు, మున్న, కోటేశ్వరరావు, వెంకన్న, పెద రోశయ్య, బ్రహ్మ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News