Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:54 PM

నలంద డిగ్రీ కళాశాలలో సిగ్నేచర్ డే వేడుకలు

నలంద డిగ్రీ కళాశాలలో సిగ్నేచర్ డే వేడుకలు

నలంద డిగ్రీ కళాశాలలో సిగ్నేచర్ డే వేడుకలు
April 01, 2026 08:44 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జ్ఞాపకాల సంతకంతో భావోద్వేగ వీడ్కోలు – ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని ఉపాధ్యాయుల పిలుపు

నలంద డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు జ్ఞాపకాల సంతకం పేరుతో సిగ్నేచర్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మూడు సంవత్సరాల విద్యార్థి జీవితంలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు భావోద్వేగ క్షణాలను అనుభవించారు.ఈ సందర్భంగా కళాశాల మేనేజ్మెంట్, అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో విజయవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని నలంద డిగ్రీ కళాశాల ఎల్లప్పుడూ అందిస్తుందని తెలిపారు.విద్యార్థి జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ ప్రారంభమవుతుందని, కళాశాలను వదిలి వెళ్లడం బాధాకరమైనదైనా, దాన్ని జీవితంలో ఎదుగుదలకు మొదటి మెట్టుగా భావించాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని సరైన దిశలో ముందుకు సాగాలని ఉపాధ్యాయులు హితవు పలికారు. విద్యార్థులు ఒకరి నుంచి మరొకరు సంతకాలు సేకరించుకుని, కన్నీటి పర్యంతంగా వీడ్కోలు చెప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బత్తుల శంకర్, కరస్పాండెంట్ వల్లమల రాజశేఖర్, ప్రిన్సిపాల్ పోలు విష్ణుకుమార్, డైరెక్టర్లు వాలుగొండ శ్రీనివాస్, చిలువేరు దుర్గయ్య, కట్టెల లింగస్వామి, అధ్యాపకులు కడగంచి రాములు, లింగయ్య, నాగలక్ష్మి, శివప్రసాద్, సువర్ణ, మహేష్, బాలరాజు, శ్రీవాణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News