Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 09:04 AM

నలంద డిగ్రీ కళాశాలలో సిగ్నేచర్ డే వేడుకలు

నలంద డిగ్రీ కళాశాలలో సిగ్నేచర్ డే వేడుకలు

నలంద డిగ్రీ కళాశాలలో సిగ్నేచర్ డే వేడుకలు
01-04-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జ్ఞాపకాల సంతకంతో భావోద్వేగ వీడ్కోలు – ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని ఉపాధ్యాయుల పిలుపు

నలంద డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు జ్ఞాపకాల సంతకం పేరుతో సిగ్నేచర్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మూడు సంవత్సరాల విద్యార్థి జీవితంలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు భావోద్వేగ క్షణాలను అనుభవించారు.ఈ సందర్భంగా కళాశాల మేనేజ్మెంట్, అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో విజయవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని నలంద డిగ్రీ కళాశాల ఎల్లప్పుడూ అందిస్తుందని తెలిపారు.విద్యార్థి జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ ప్రారంభమవుతుందని, కళాశాలను వదిలి వెళ్లడం బాధాకరమైనదైనా, దాన్ని జీవితంలో ఎదుగుదలకు మొదటి మెట్టుగా భావించాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని సరైన దిశలో ముందుకు సాగాలని ఉపాధ్యాయులు హితవు పలికారు. విద్యార్థులు ఒకరి నుంచి మరొకరు సంతకాలు సేకరించుకుని, కన్నీటి పర్యంతంగా వీడ్కోలు చెప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బత్తుల శంకర్, కరస్పాండెంట్ వల్లమల రాజశేఖర్, ప్రిన్సిపాల్ పోలు విష్ణుకుమార్, డైరెక్టర్లు వాలుగొండ శ్రీనివాస్, చిలువేరు దుర్గయ్య, కట్టెల లింగస్వామి, అధ్యాపకులు కడగంచి రాములు, లింగయ్య, నాగలక్ష్మి, శివప్రసాద్, సువర్ణ, మహేష్, బాలరాజు, శ్రీవాణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నలంద డిగ్రీ కళాశాలలో సిగ్నేచర్ డే వేడుకలు

Article Image

జ్ఞాపకాల సంతకంతో భావోద్వేగ వీడ్కోలు – ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని ఉపాధ్యాయుల పిలుపు

నలంద డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు జ్ఞాపకాల సంతకం పేరుతో సిగ్నేచర్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మూడు సంవత్సరాల విద్యార్థి జీవితంలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు భావోద్వేగ క్షణాలను అనుభవించారు.ఈ సందర్భంగా కళాశాల మేనేజ్మెంట్, అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో విజయవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని నలంద డిగ్రీ కళాశాల ఎల్లప్పుడూ అందిస్తుందని తెలిపారు.విద్యార్థి జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ ప్రారంభమవుతుందని, కళాశాలను వదిలి వెళ్లడం బాధాకరమైనదైనా, దాన్ని జీవితంలో ఎదుగుదలకు మొదటి మెట్టుగా భావించాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని సరైన దిశలో ముందుకు సాగాలని ఉపాధ్యాయులు హితవు పలికారు. విద్యార్థులు ఒకరి నుంచి మరొకరు సంతకాలు సేకరించుకుని, కన్నీటి పర్యంతంగా వీడ్కోలు చెప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బత్తుల శంకర్, కరస్పాండెంట్ వల్లమల రాజశేఖర్, ప్రిన్సిపాల్ పోలు విష్ణుకుమార్, డైరెక్టర్లు వాలుగొండ శ్రీనివాస్, చిలువేరు దుర్గయ్య, కట్టెల లింగస్వామి, అధ్యాపకులు కడగంచి రాములు, లింగయ్య, నాగలక్ష్మి, శివప్రసాద్, సువర్ణ, మహేష్, బాలరాజు, శ్రీవాణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News