Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గంజాయితో ఐదుగురు అరెస్ట్ భూ వివాదాలకు చెక్… భూభారతి పోర్టల్‌కు శ్రీకారం “టికెట్ ఉంటే సీటు తప్పనిసరి… ఇది ప్రతి పౌరుని హక్కు!” చెన్నైపై రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం.. సూర్యవంశీ ఊచకోత! రామోత్సవం ఘనంగా నిర్వహణ – భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలు “పరిశోధనలతోనే ఉన్నత విద్యకు నాణ్యత: అకాడమిక్ కౌన్సిల్‌లో చర్చ” అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: April 01, 2026 11:02 PM

నలంద డిగ్రీ కళాశాలలో సిగ్నేచర్ డే వేడుకలు

నలంద డిగ్రీ కళాశాలలో సిగ్నేచర్ డే వేడుకలు

నలంద డిగ్రీ కళాశాలలో సిగ్నేచర్ డే వేడుకలు
April 01, 2026 08:44 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

జ్ఞాపకాల సంతకంతో భావోద్వేగ వీడ్కోలు – ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని ఉపాధ్యాయుల పిలుపు

నలంద డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు జ్ఞాపకాల సంతకం పేరుతో సిగ్నేచర్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మూడు సంవత్సరాల విద్యార్థి జీవితంలోని మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ విద్యార్థులు భావోద్వేగ క్షణాలను అనుభవించారు.ఈ సందర్భంగా కళాశాల మేనేజ్మెంట్, అధ్యాపకులు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో విజయవంతమైన జీవితాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన మార్గదర్శకత్వాన్ని నలంద డిగ్రీ కళాశాల ఎల్లప్పుడూ అందిస్తుందని తెలిపారు.విద్యార్థి జీవితంలో ఒక దశ ముగిసి మరో దశ ప్రారంభమవుతుందని, కళాశాలను వదిలి వెళ్లడం బాధాకరమైనదైనా, దాన్ని జీవితంలో ఎదుగుదలకు మొదటి మెట్టుగా భావించాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని సరైన దిశలో ముందుకు సాగాలని ఉపాధ్యాయులు హితవు పలికారు. విద్యార్థులు ఒకరి నుంచి మరొకరు సంతకాలు సేకరించుకుని, కన్నీటి పర్యంతంగా వీడ్కోలు చెప్పుకున్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ బత్తుల శంకర్, కరస్పాండెంట్ వల్లమల రాజశేఖర్, ప్రిన్సిపాల్ పోలు విష్ణుకుమార్, డైరెక్టర్లు వాలుగొండ శ్రీనివాస్, చిలువేరు దుర్గయ్య, కట్టెల లింగస్వామి, అధ్యాపకులు కడగంచి రాములు, లింగయ్య, నాగలక్ష్మి, శివప్రసాద్, సువర్ణ, మహేష్, బాలరాజు, శ్రీవాణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News