Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:43 AM

నల్గొండ ఉడిపి హోటల్లో సాంబార్ లొ జెర్రీ కలకలం

నల్గొండ ఉడిపి హోటల్లో సాంబార్ లొ జెర్రీ కలకలం

నల్గొండ ఉడిపి హోటల్లో సాంబార్ లొ  జెర్రీ కలకలం
January 13, 2026 02:25 PM 181 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ స్థానికం ప్రతినిధి కోమిడాల మహేందర్ రెడ్డి

నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్డులోని ప్రసాద్ ఉడుపి హోటల్ లో ఆహార భద్రతకు సంబంధించిన ఘటన చోటుచేసుకుంది. ఉదయం సాంబార్–ఇడ్లీ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు వడ్డించిన సాంబార్‌లో జెర్రి ఉన్నట్లు గుర్తించారు.

బోజనం దాదాపు పూర్తయ్యాక గిన్నెలో మిగిలిన సాంబార్‌లో జెర్రిని గమనించిన కస్టమర్ వెంటనే హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనతో హోటల్ ప్రాంగణంలో కొంతసేపు గందరగోళం ఏర్పడింది.

స్థానికంగా మంచి పేరు ఉన్న హోటల్‌లో ఇలాంటి ఘటన జరగడం వినియోగదారుల్లో ఆందోళనకు కారణమైంది. హోటల్ వంటశాల పరిశుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత అధికారులు ఈ ఘటనపై స్పందించి ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం తనిఖీలు నిర్వహించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. హోటల్ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News