నల్గొండ ఉడిపి హోటల్లో సాంబార్ లొ జెర్రీ కలకలం
నల్గొండ ఉడిపి హోటల్లో సాంబార్ లొ జెర్రీ కలకలం
Komidala Mahender reddy
నల్గొండ స్థానికం ప్రతినిధి కోమిడాల మహేందర్ రెడ్డి
నల్గొండ పట్టణం హైదరాబాద్ రోడ్డులోని ప్రసాద్ ఉడుపి హోటల్ లో ఆహార భద్రతకు సంబంధించిన ఘటన చోటుచేసుకుంది. ఉదయం సాంబార్–ఇడ్లీ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్కు వడ్డించిన సాంబార్లో జెర్రి ఉన్నట్లు గుర్తించారు.
బోజనం దాదాపు పూర్తయ్యాక గిన్నెలో మిగిలిన సాంబార్లో జెర్రిని గమనించిన కస్టమర్ వెంటనే హోటల్ సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనతో హోటల్ ప్రాంగణంలో కొంతసేపు గందరగోళం ఏర్పడింది.
స్థానికంగా మంచి పేరు ఉన్న హోటల్లో ఇలాంటి ఘటన జరగడం వినియోగదారుల్లో ఆందోళనకు కారణమైంది. హోటల్ వంటశాల పరిశుభ్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సంబంధిత అధికారులు ఈ ఘటనపై స్పందించి ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం తనిఖీలు నిర్వహించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. హోటల్ యాజమాన్యం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి