నల్గొండలో విజ్ఞాన్ స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్.విద్యార్థులకు ఇంజినీరింగ్ కోర్సులపై అవగాహన
నల్గొండలో విజ్ఞాన్ స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్.విద్యార్థులకు ఇంజినీరింగ్ కోర్సులపై అవగాహన
Editor Desk
నల్గొండ టౌన్, ఇంటర్ పూర్తిచేసుకున్న విద్యార్థుల కోసం విజ్ఞాన్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ ఆధ్వర్యంలో 2026 స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని నల్గొండలో నిర్వహించారు. హైదరాబాద్ రోడ్డులోని హోటల్ మనోరమ బ్యాంకెట్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఎంసెట్లో ఉత్తీర్ణులైన, ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య, కాలేజీ ఎంపిక, బ్రాంచ్ల ఎంపికపై నిపుణులు అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు అక్కడికక్కడే అడ్మిషన్లు కూడా తీసుకున్నారు.
విజ్ఞాన్ గ్రూప్స్ చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య సూచనలతో, వీఎఫ్ఎస్టీఆర్ హైదరాబాద్ ఆఫ్ క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ వైవీ దాసేశ్వరరావు సలహాలతో కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అడ్మిషన్ కోఆర్డినేటర్ డాక్టర్ సునీల్కుమార్ సమన్వయంతో కౌన్సెలింగ్ విజయవంతమైంది.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ అనిల్కుమార్, ఫార్మసీ కోఆర్డినేటర్ డాక్టర్ నరేష్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. స్థానిక సిబ్బంది ఉబ్బని శ్రీకాంత్, జిల్లా అడ్మిషన్ మేనేజర్ సైదులు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి