Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:00 AM

నల్గొండలో విజ్ఞాన్‌ స్పాట్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌.విద్యార్థులకు ఇంజినీరింగ్‌ కోర్సులపై అవగాహన

నల్గొండలో విజ్ఞాన్‌ స్పాట్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌.విద్యార్థులకు ఇంజినీరింగ్‌ కోర్సులపై అవగాహన

నల్గొండలో విజ్ఞాన్‌ స్పాట్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌.విద్యార్థులకు ఇంజినీరింగ్‌ కోర్సులపై అవగాహన
18-05-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ టౌన్‌, ఇంటర్‌ పూర్తిచేసుకున్న విద్యార్థుల కోసం విజ్ఞాన్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ ఆధ్వర్యంలో 2026 స్పాట్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ కార్యక్రమాన్ని నల్గొండలో నిర్వహించారు. హైదరాబాద్‌ రోడ్డులోని హోటల్‌ మనోరమ బ్యాంకెట్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన, ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్య, కాలేజీ ఎంపిక, బ్రాంచ్‌ల ఎంపికపై నిపుణులు అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు అక్కడికక్కడే అడ్మిషన్లు కూడా తీసుకున్నారు.

విజ్ఞాన్‌ గ్రూప్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య సూచనలతో, వీఎఫ్‌ఎస్‌టీఆర్‌ హైదరాబాద్‌ ఆఫ్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ దాసేశ్వరరావు సలహాలతో కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అడ్మిషన్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సునీల్‌కుమార్‌ సమన్వయంతో కౌన్సెలింగ్‌ విజయవంతమైంది.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, ఫార్మసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నరేష్‌ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. స్థానిక సిబ్బంది ఉబ్బని శ్రీకాంత్‌, జిల్లా అడ్మిషన్‌ మేనేజర్‌ సైదులు, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నల్గొండలో విజ్ఞాన్‌ స్పాట్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌.విద్యార్థులకు ఇంజినీరింగ్‌ కోర్సులపై అవగాహన

Article Image

నల్గొండ టౌన్‌, ఇంటర్‌ పూర్తిచేసుకున్న విద్యార్థుల కోసం విజ్ఞాన్‌ యూనివర్సిటీ హైదరాబాద్‌ క్యాంపస్‌ ఆధ్వర్యంలో 2026 స్పాట్‌ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ కార్యక్రమాన్ని నల్గొండలో నిర్వహించారు. హైదరాబాద్‌ రోడ్డులోని హోటల్‌ మనోరమ బ్యాంకెట్‌ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన, ఉత్తీర్ణులు కాని విద్యార్థులకు ఇంజినీరింగ్‌ విద్య, కాలేజీ ఎంపిక, బ్రాంచ్‌ల ఎంపికపై నిపుణులు అవగాహన కల్పించారు. విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు విద్యార్థులు అక్కడికక్కడే అడ్మిషన్లు కూడా తీసుకున్నారు.

విజ్ఞాన్‌ గ్రూప్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య సూచనలతో, వీఎఫ్‌ఎస్‌టీఆర్‌ హైదరాబాద్‌ ఆఫ్‌ క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వైవీ దాసేశ్వరరావు సలహాలతో కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. అడ్మిషన్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ సునీల్‌కుమార్‌ సమన్వయంతో కౌన్సెలింగ్‌ విజయవంతమైంది.

ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, ఫార్మసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ నరేష్‌ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. స్థానిక సిబ్బంది ఉబ్బని శ్రీకాంత్‌, జిల్లా అడ్మిషన్‌ మేనేజర్‌ సైదులు, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News