నల్గొండలో ఉద్యోగాల పేరిట మోసం: నిరుద్యోగులకు భారీ దగా
నల్గొండలో ఉద్యోగాల పేరిట మోసం: నిరుద్యోగులకు భారీ దగా
Komidala Mahender reddy
నల్గొండ జిల్లాలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. దేవాదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ ముఠా వందలాది మందిని మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఆలయాల్లో హుండీ లెక్కింపు, ఇతర చిన్నపాటి ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. దాదాపు 1500 మంది బాధితుల నుంచి కోట్ల రూపాయలు ఈ గ్యాంగ్ దోచుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
డబ్బులు చెల్లించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడం, ముఠా సభ్యులు ఫోన్లకు స్పందించకపోవడంతో బాధితులు మోసపోయినట్లు గ్రహించారు. ఈ మోసానికి ప్రధాన సూత్రధారి పులి రవి అని తెలుస్తోంది. అతనికి ఏజెంట్గా పనిచేసిన జనార్ధన్ కట్టంగూరు మండలం అన్నారం గ్రామానికి చెందినవాడిగా, ప్రస్తుతం నల్గొండలో నివసిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఈ వ్యవహారం పెద్దగా బయటకు రాలేదు. అయితే ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపితే ఈ కుంభకోణం పూర్తిగా బయటపడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.
ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి