Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా 13వ వార్డు కౌన్సిలర్ గుర్రాల సంతోష శ్రీనివాస్ జన్మదిన వేడుకలు 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 07:00 AM

నల్గొండలో ఉద్యోగాల పేరిట మోసం: నిరుద్యోగులకు భారీ దగా

నల్గొండలో ఉద్యోగాల పేరిట మోసం: నిరుద్యోగులకు భారీ దగా

నల్గొండలో ఉద్యోగాల పేరిట మోసం: నిరుద్యోగులకు భారీ దగా
May 02, 2026 03:27 PM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లాలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. దేవాదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ ముఠా వందలాది మందిని మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆలయాల్లో హుండీ లెక్కింపు, ఇతర చిన్నపాటి ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. దాదాపు 1500 మంది బాధితుల నుంచి కోట్ల రూపాయలు ఈ గ్యాంగ్ దోచుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డబ్బులు చెల్లించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడం, ముఠా సభ్యులు ఫోన్లకు స్పందించకపోవడంతో బాధితులు మోసపోయినట్లు గ్రహించారు. ఈ మోసానికి ప్రధాన సూత్రధారి పులి రవి అని తెలుస్తోంది. అతనికి ఏజెంట్‌గా పనిచేసిన జనార్ధన్ కట్టంగూరు మండలం అన్నారం గ్రామానికి చెందినవాడిగా, ప్రస్తుతం నల్గొండలో నివసిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఈ వ్యవహారం పెద్దగా బయటకు రాలేదు. అయితే ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపితే ఈ కుంభకోణం పూర్తిగా బయటపడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News