Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:27 AM

నల్గొండలో ఉద్యోగాల పేరిట మోసం: నిరుద్యోగులకు భారీ దగా

నల్గొండలో ఉద్యోగాల పేరిట మోసం: నిరుద్యోగులకు భారీ దగా

నల్గొండలో ఉద్యోగాల పేరిట మోసం: నిరుద్యోగులకు భారీ దగా
02-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లాలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. దేవాదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ ముఠా వందలాది మందిని మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆలయాల్లో హుండీ లెక్కింపు, ఇతర చిన్నపాటి ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. దాదాపు 1500 మంది బాధితుల నుంచి కోట్ల రూపాయలు ఈ గ్యాంగ్ దోచుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డబ్బులు చెల్లించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడం, ముఠా సభ్యులు ఫోన్లకు స్పందించకపోవడంతో బాధితులు మోసపోయినట్లు గ్రహించారు. ఈ మోసానికి ప్రధాన సూత్రధారి పులి రవి అని తెలుస్తోంది. అతనికి ఏజెంట్‌గా పనిచేసిన జనార్ధన్ కట్టంగూరు మండలం అన్నారం గ్రామానికి చెందినవాడిగా, ప్రస్తుతం నల్గొండలో నివసిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఈ వ్యవహారం పెద్దగా బయటకు రాలేదు. అయితే ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపితే ఈ కుంభకోణం పూర్తిగా బయటపడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Sthanikam

నల్గొండలో ఉద్యోగాల పేరిట మోసం: నిరుద్యోగులకు భారీ దగా

Article Image

నల్గొండ జిల్లాలో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఉద్యోగాల పేరుతో భారీ మోసం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. దేవాదాయ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఓ ముఠా వందలాది మందిని మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఆలయాల్లో హుండీ లెక్కింపు, ఇతర చిన్నపాటి ఉద్యోగాల పేరుతో ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.2 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. దాదాపు 1500 మంది బాధితుల నుంచి కోట్ల రూపాయలు ఈ గ్యాంగ్ దోచుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

డబ్బులు చెల్లించినప్పటికీ ఉద్యోగాలు రాకపోవడం, ముఠా సభ్యులు ఫోన్లకు స్పందించకపోవడంతో బాధితులు మోసపోయినట్లు గ్రహించారు. ఈ మోసానికి ప్రధాన సూత్రధారి పులి రవి అని తెలుస్తోంది. అతనికి ఏజెంట్‌గా పనిచేసిన జనార్ధన్ కట్టంగూరు మండలం అన్నారం గ్రామానికి చెందినవాడిగా, ప్రస్తుతం నల్గొండలో నివసిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఈ వ్యవహారం పెద్దగా బయటకు రాలేదు. అయితే ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారణ జరిపితే ఈ కుంభకోణం పూర్తిగా బయటపడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News