నల్గొండలో గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై దాడులు – 68 సిలిండర్లు సీజ్, 6A కేసులు నమోదు
నల్గొండలో గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై దాడులు – 68 సిలిండర్లు సీజ్, 6A కేసులు నమోదు
Komidala Mahender reddy
నల్గొండ గృహ వినియోగానికి ఉద్దేశించిన ఎల్పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్న హోటళ్లపై అధికారుల బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. నల్గొండ పట్టణంతో పాటు మల్లేపల్లి టౌన్లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 68 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.నల్గొండ టౌన్లోని ప్రసాద్ ఉడిపి హోటల్, నందిని హోటల్, కృతుంగ హోటళ్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఇదే తరహాలో మల్లేపల్లి టౌన్లోని నేహా హోటల్, సాయినందిని హోటల్, తేజస్విన్ వాటర్ ప్లాంట్స్ తదితర ప్రదేశాల్లో కూడా దాడులు నిర్వహించారు.ఈ తనిఖీల్లో గృహ వినియోగానికి కేటాయించిన సిలిండర్లు పెద్ద ఎత్తున అక్రమంగా ఉపయోగిస్తున్నట్టు తేలడంతో మొత్తం 68 సిలిండర్లను సీజ్ చేశారు. సంబంధిత హోటల్ యాజమాన్యాలపై ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం కింద 6A కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.అనుమతి లేకుండా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలపై భవిష్యత్తులో కూడా నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి