Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం : టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 05:31 PM

నల్గొండలో గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై దాడులు – 68 సిలిండర్లు సీజ్, 6A కేసులు నమోదు

నల్గొండలో గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై దాడులు – 68 సిలిండర్లు సీజ్, 6A కేసులు నమోదు

నల్గొండలో గ్యాస్ సిలిండర్ల దుర్వినియోగంపై దాడులు – 68 సిలిండర్లు సీజ్, 6A కేసులు నమోదు
March 12, 2026 10:10 PM 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ గృహ వినియోగానికి ఉద్దేశించిన ఎల్‌పీజీ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు అక్రమంగా ఉపయోగిస్తున్న హోటళ్లపై అధికారుల బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది. నల్గొండ పట్టణంతో పాటు మల్లేపల్లి టౌన్‌లో నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 68 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు.నల్గొండ టౌన్‌లోని ప్రసాద్ ఉడిపి హోటల్, నందిని హోటల్, కృతుంగ హోటళ్లలో తనిఖీలు చేపట్టిన అధికారులు గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య ప్రయోజనాలకు వినియోగిస్తున్నట్టు గుర్తించారు. ఇదే తరహాలో మల్లేపల్లి టౌన్‌లోని నేహా హోటల్, సాయినందిని హోటల్, తేజస్విన్ వాటర్ ప్లాంట్స్ తదితర ప్రదేశాల్లో కూడా దాడులు నిర్వహించారు.ఈ తనిఖీల్లో గృహ వినియోగానికి కేటాయించిన సిలిండర్లు పెద్ద ఎత్తున అక్రమంగా ఉపయోగిస్తున్నట్టు తేలడంతో మొత్తం 68 సిలిండర్లను సీజ్ చేశారు. సంబంధిత హోటల్ యాజమాన్యాలపై ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం కింద 6A కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.అనుమతి లేకుండా గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి అక్రమాలపై భవిష్యత్తులో కూడా నిరంతర తనిఖీలు కొనసాగిస్తామని అధికారులు పేర్కొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News