నల్గొండలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
నల్గొండలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం
Komidala Mahender reddy
నల్గొండ మండల కేంద్రంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పై నమోదైన పోక్సో కేసులో వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దహనం చేశారు.ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ, మైనర్ బాలికపై లైంగిక వేధింపుల కేసులో నిందితుడిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదై ఏడు రోజులు గడిచినా అరెస్ట్ చేయకపోవడం దుర్మార్గమని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి బీ-టీమ్లా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండదండలతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.
బాధిత బాలిక కుటుంబానికి పూర్తి రక్షణ కల్పించి న్యాయం చేయాలని, కేంద్ర ప్రభుత్వం బండి సంజయ్ను పదవి నుంచి తొలగించాలని, రాష్ట్ర ప్రభుత్వం బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో మహిళల భద్రత పూర్తిగా దెబ్బతిందని, మహిళల రక్షణ విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. అలాగే ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి