"నల్గొండ నవ కార్పొరేటర్స్ కోసం ఓవైసీ ఫిబ్రవరి 1న ప్రచార బేరి"
"నల్గొండ నవ కార్పొరేటర్స్ కోసం ఓవైసీ ఫిబ్రవరి 1న ప్రచార బేరి"
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
"నల్గొండ నవ కార్పొరేటర్స్ కోసం ఓవైసీ ఫిబ్రవరి 1న ప్రచార బేరి"
నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి: సీనియర్ జర్నలిస్ట్ డి.డి. దాసు
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 48 వార్డుల ఎన్నికల్లో AIMIM పార్టీ బలపరిచిన 9 మంది కీలక కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపు కోసం జాతీయ అధ్యక్షులు అసద్ ఉద్దీన్ ఓవైసీ ఫిబ్రవరి 1న నల్గొండలో భారీ ప్రచార యాత్ర ప్రారంభిస్తూ రంగంలోకి దిగుతున్నారు, మధ్యాహ్నం 2:00 గంటల నుంచి వార్డుల వారీగా పాదయాత్రలు ప్రచార సమావేశాలతో మొదలైన కార్యక్రమం సాయంత్రం 7:00 గంటలకు భాస్కర్ టాకీస్ చౌరస్తా వద్ద మహా బహిరంగ సభతో ఉత్కంఠాకరంగా ముగుస్తుంది, ఓవైసీ తన సిగ్నేచర్ శక్తి ప్రసంగంతో నల్గొండ ప్రజల సమస్యలు అభివృద్ధి అంశాలు పార్టీ భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడి AIMIM కార్యకర్తల్లో అఖండ ఉత్సాహాన్ని రేకెత్తించనున్నారు, ఈ మహా సభ కోసం స్థల పరిశీలన పూర్తి అయిన నల్గొండ AIMIM జిల్లా ఇన్చార్జ్ సయ్యద్ అలీమ్ హైదరాబాద్ మాజీ కార్పొరేటర్ ముర్తుజ్ జిల్లా అధ్యక్షుడు రజియుద్దీన్ టౌన్ అధ్యక్షుడు హాజీ తదితర నాయకులు అభ్యర్థులు కార్యకర్తలు కార్యక్రమ వివరాలను సమీక్షించారు, 576 చెల్లుబాటైన నామినేషన్ల మధ్య AIMIM 17 మంది అభ్యర్థులతో పోటీ పడుతున్న కాంగ్రెస్-143, BRS-134, BJP-122 నామినేషన్లతో ప్రధాన పోటీదారులు 97 స్వతంత్రులు చిన్న పార్టీలు బరిలో ఉన్న 9 మంది కీలక అభ్యర్థులపై ప్రత్యేక దృష్టి పెట్టిన AIMIM పాదయాత్రలు మహా సభల ద్వారా ఓటర్ల సంబంధం పెంచుకుంటోంది, నల్గొండలో కాంగ్రెస్ ఆధిక్యంతో BRS BJP తీవ్ర పోటీ జరుగుతున్న మైనారిటీ ప్రాంతాల్లో AIMIM బలోపేతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది, ఓవైసీ ప్రసంగాలు వాస్తవాలు వివాదాలు ఉత్సాహంతో ప్రజల సమస్యలపై వెలుగొందని అంచనా, నామినేషన్ స్క్రూటినీ పూర్తి ఉపసంహారణ ఫిబ్రవరి 3 వరకు పోలింగ్ ఫిబ్రవరి10న జరగనుంది, ఓవైసీ రాకతో AIMIM ప్రచారం జోరుగా జరుగుతోంది నల్గొండ రాజకీయ ఉత్కంఠ గరిష్ఠానికి చేరింది, ఓవైసీ మాటలతో AIMIM కార్యకర్తలు అభ్యర్థులు ఎలాంటి ఉత్సాహంతో ముందుకు సాగతారో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి