తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్, నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆదేశాల మేరకు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన బీ-ఫామ్లను పంపిణీ చేశారు.
నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత చేతుల మీదుగా MLC శంకర్ నాయక్, కత్తుల కోటిలకు బీ-ఫామ్లు అందజేశారు. పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి