PRINT TIME: May 26, 2026 03:05 PM
నల్గొండ జిల్లాలో దారుణం.. మహిళ గొంతు కోసి పరారైన దుండగులు
నల్గొండ జిల్లాలో దారుణం.. మహిళ గొంతు కోసి పరారైన దుండగులు
May 18, 2026 10:02 PM
22 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం కొంపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గాలి పద్మ అనే మహిళపై గుర్తుతెలియని దుండగులు దాడి చేసి గొంతు కోసి పరారయ్యారు.
రక్తపు మడుగులో పడి ఉన్న మహిళను కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గమనించి వెంటనే హాలియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దాడి వెనుక కారణాలపై దర్యాప్తు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి