Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 02:55 PM

నలభై ఎనిమిది వార్డుల పౌరులకు అందుబాటులో ఉంటా – నివేదిత లక్షాది

నలభై ఎనిమిది వార్డుల పౌరులకు అందుబాటులో ఉంటా – నివేదిత లక్షాది

నలభై ఎనిమిది వార్డుల పౌరులకు అందుబాటులో ఉంటా – నివేదిత లక్షాది
February 22, 2026 07:00 PM 94 Views
Reporter
స్థానికం ప్రతినిధి : సూర్యాపేట జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Biksham Goud

సాయి కల్యాణ్ అపార్ట్మెంట్‌లో ఆత్మీయ సన్మానం

సూర్యాపేట పట్టణంలోని సాయి కల్యాణ్ అపార్ట్మెంట్‌లో నిర్వహించిన స్నేహ సమావేశ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా ముప్పై మూడు వ వార్డు కౌన్సిలర్ నాగుల శ్రీనివాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముప్పై మూడు వ వార్డు పౌరులు వారికి ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా నివేదిత లక్షాది మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని నలభై ఎనిమిది వార్డుల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తామని చెప్పారు. సూర్యాపేటను ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మేధావుల సలహాలు, ప్రజల సూచనలు తీసుకుంటూ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతామని వెల్లడించారు.

వార్డు అభివృద్ధికి ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని, శుభ్రత, మౌలిక వసతులు, వీధి దీపాలు, తాగునీరు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ముప్పై మూడు వ వార్డు కౌన్సిలర్ నాగుల శ్రీనివాసు మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తానని చెప్పారు. ప్రజల సూచనలను గౌరవించి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో చాపల వెంకటేశ్వర్లు, మాడిశెట్టి శ్రీనివాస్, పసుమర్తి హరి, వనమా వెంకటేశ్వర్లు, పోతుగంటి ప్రవీణ్, యర్రా నారాయణ రెడ్డి, కృష్ణ, సుబ్రహ్మణ్యం, తనూజ, శ్రీదేవి, పవిత్ర, లక్ష్మి, వాణి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News