Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నియోజకవర్గ సాధనకు ఐక్యంగా ముందుకు రావాలి – సర్పంచ్‌ల సన్మానం సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 02:45 PM

నలభై ఎనిమిది వార్డుల పౌరులకు అందుబాటులో ఉంటా – నివేదిత లక్షాది

నలభై ఎనిమిది వార్డుల పౌరులకు అందుబాటులో ఉంటా – నివేదిత లక్షాది

నలభై ఎనిమిది వార్డుల పౌరులకు అందుబాటులో ఉంటా – నివేదిత లక్షాది
February 22, 2026 07:00 PM 124 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సాయి కల్యాణ్ అపార్ట్మెంట్‌లో ఆత్మీయ సన్మానం

సూర్యాపేట పట్టణంలోని సాయి కల్యాణ్ అపార్ట్మెంట్‌లో నిర్వహించిన స్నేహ సమావేశ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా ముప్పై మూడు వ వార్డు కౌన్సిలర్ నాగుల శ్రీనివాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముప్పై మూడు వ వార్డు పౌరులు వారికి ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా నివేదిత లక్షాది మాట్లాడుతూ సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని నలభై ఎనిమిది వార్డుల ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రాధాన్యత ఆధారంగా పరిష్కరిస్తామని చెప్పారు. సూర్యాపేటను ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు మేధావుల సలహాలు, ప్రజల సూచనలు తీసుకుంటూ సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతామని వెల్లడించారు.

వార్డు అభివృద్ధికి ప్రజల సహకారం అత్యంత ముఖ్యమని, శుభ్రత, మౌలిక వసతులు, వీధి దీపాలు, తాగునీరు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ముప్పై మూడు వ వార్డు కౌన్సిలర్ నాగుల శ్రీనివాసు మాట్లాడుతూ వార్డు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తానని చెప్పారు. ప్రజల సూచనలను గౌరవించి వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో చాపల వెంకటేశ్వర్లు, మాడిశెట్టి శ్రీనివాస్, పసుమర్తి హరి, వనమా వెంకటేశ్వర్లు, పోతుగంటి ప్రవీణ్, యర్రా నారాయణ రెడ్డి, కృష్ణ, సుబ్రహ్మణ్యం, తనూజ, శ్రీదేవి, పవిత్ర, లక్ష్మి, వాణి తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News