Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం రంగేపల్లిలో అవగాహన సదస్సు విజయవంతం “గురుకుల ఔట్‌సోర్సింగ్, గెస్ట్, కాంట్రాక్ట్ టీచర్లకు ఉద్యోగ భద్రత, 12 నెలల జీతాలు కల్పించాలి: సిఐటియు డిమాండ్” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 01:39 AM

నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం అవుతా: రాజగోపాల్ రెడ్డి మరో సంచలనం

నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం అవుతా: రాజగోపాల్ రెడ్డి మరో సంచలనం

నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం అవుతా: రాజగోపాల్ రెడ్డి మరో సంచలనం
February 14, 2026 05:06 AM 161 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. మంత్రి పదవిపై హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందని మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అవుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్ చేశారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనకు అడుక్కోవడం రాదని మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవ్వండని లేదంటే లాక్కునేదాకా చూసుకోవద్దంటూ ఘాటుగానే హెచ్చరించారు. తనకు ఇచ్చిన మాట ప్రకారం చేయండి లేదంటే డైరెక్ట్ నా టార్గెట్ అదే అంటూ ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి అన్నారు. ఇకనుండి మునుగోడు నియోజకవర్గం ను (ప్రజలు) చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని నేను చూసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణలో ఇక జెండా ఎగరవేద్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆయనవెంట మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, గెలుపొందిన నూతన కౌన్సిలర్లు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News