Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:56 PM

నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం అవుతా: రాజగోపాల్ రెడ్డి మరో సంచలనం

నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం అవుతా: రాజగోపాల్ రెడ్డి మరో సంచలనం

నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే సీఎం అవుతా: రాజగోపాల్ రెడ్డి మరో సంచలనం
February 14, 2026 05:06 AM 164 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ.. మంత్రి పదవిపై హాట్ కామెంట్స్ చేశారు. రాబోయే రోజుల్లో తనకు మంత్రి పదవి వస్తుందని మంత్రి కాకపోతే ముఖ్యమంత్రి అవుతానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్ చేశారు. శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాక యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన కౌన్సిలర్ అభ్యర్థులతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మునుగోడు ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తనకు అడుక్కోవడం రాదని మర్యాదగా ఇచ్చిన మాటకు కట్టుబడి ఇవ్వండని లేదంటే లాక్కునేదాకా చూసుకోవద్దంటూ ఘాటుగానే హెచ్చరించారు. తనకు ఇచ్చిన మాట ప్రకారం చేయండి లేదంటే డైరెక్ట్ నా టార్గెట్ అదే అంటూ ముఖ్యమంత్రి పదవిని ఉద్దేశించి అన్నారు. ఇకనుండి మునుగోడు నియోజకవర్గం ను (ప్రజలు) చూసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని నేను చూసుకుంటానని ఎమ్మెల్యే అన్నారు. సమయం వచ్చినప్పుడు తెలంగాణలో ఇక జెండా ఎగరవేద్దామంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆయనవెంట మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమన్వయకర్త పబ్బు రాజు గౌడ్, గెలుపొందిన నూతన కౌన్సిలర్లు ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News