Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పనసం అంజయ్య గౌడ్‌కు కన్నీటి నివాళి ఆర్. డి. టీ సంస్థ కి సహాయం చేయడం నా అదృష్టం :- లోకేష్ సీఎం భూమి పూజ చేయడానికి ఏర్పాట్లు సిద్ధం సీఎం పర్యటనపై భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న సత్యసాయి జిల్లా అధికారులు వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. సోమందేపల్లి పోలీసులకు డే డ్రోన్ & నైట్ విజన్ డ్రోన్‌లపై ప్రత్యేక శిక్షణ ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 15, 2026 10:09 PM

నకిరేకల్‌లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం

నకిరేకల్‌లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం

నకిరేకల్‌లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం
May 15, 2026 09:05 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ మండల పరిధిలోని కందిమల్లెవారి గూడెంలో గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ ఇసుక దందా కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే మట్టిని ఫిల్టర్ చేసి తీసిన ఇసుకను ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ట్రిప్‌కు రూ.6500 చొప్పున సరఫరా చేస్తున్నారని తెలిపారు.

నాణ్యతలేని ఇసుకను ఉపయోగించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి మైనింగ్ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా చర్యలు తీసుకుని అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News