Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:32 AM

నకిరేకల్‌లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం

నకిరేకల్‌లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం

నకిరేకల్‌లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం
15-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నకిరేకల్ మండల పరిధిలోని కందిమల్లెవారి గూడెంలో గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ ఇసుక దందా కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే మట్టిని ఫిల్టర్ చేసి తీసిన ఇసుకను ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ట్రిప్‌కు రూ.6500 చొప్పున సరఫరా చేస్తున్నారని తెలిపారు.

నాణ్యతలేని ఇసుకను ఉపయోగించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి మైనింగ్ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా చర్యలు తీసుకుని అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Sthanikam

నకిరేకల్‌లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం

Article Image

నకిరేకల్ మండల పరిధిలోని కందిమల్లెవారి గూడెంలో గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ ఇసుక దందా కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే మట్టిని ఫిల్టర్ చేసి తీసిన ఇసుకను ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ట్రిప్‌కు రూ.6500 చొప్పున సరఫరా చేస్తున్నారని తెలిపారు.

నాణ్యతలేని ఇసుకను ఉపయోగించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి మైనింగ్ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా చర్యలు తీసుకుని అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News