PRINT TIME: May 15, 2026 10:09 PM
నకిరేకల్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం
నకిరేకల్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.. అక్రమ రవాణాపై గ్రామస్తుల ఆగ్రహం
May 15, 2026 09:05 PM
5 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Komidala Mahender reddy
నకిరేకల్ మండల పరిధిలోని కందిమల్లెవారి గూడెంలో గత కొన్ని నెలలుగా గుట్టుచప్పుడు కాకుండా అక్రమ ఇసుక దందా కొనసాగుతోందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే మట్టిని ఫిల్టర్ చేసి తీసిన ఇసుకను ప్రభుత్వ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ట్రిప్కు రూ.6500 చొప్పున సరఫరా చేస్తున్నారని తెలిపారు.
నాణ్యతలేని ఇసుకను ఉపయోగించడం వల్ల ప్రభుత్వ ప్రతిష్ఠకు మచ్చ తెచ్చే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఈ వ్యవహారంపై వెంటనే స్పందించి మైనింగ్ శాఖ, పోలీసు శాఖ సంయుక్తంగా చర్యలు తీసుకుని అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి