నకిరేకల్లో పిచ్చికుక్క బీభత్సం: నాలుగేళ్ల చిన్నారి ముఖంపై దాడి – ఆందోళనలో తల్లిదండ్రులు
నకిరేకల్లో పిచ్చికుక్క బీభత్సం: నాలుగేళ్ల చిన్నారి ముఖంపై దాడి – ఆందోళనలో తల్లిదండ్రులు
Komidala Mahender reddy
నల్గొండ జిల్లా నకిరేకల్లో పిచ్చికుక్క స్వైర విహారం కలకలం రేపింది. వీధిలో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు శరత్ చంద్రపై ఆకస్మికంగా దాడి చేసిన కుక్క, అతని ముఖంపై తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం మేరకు, శరత్ చంద్ర ఇంటి ముందు ఆడుకుంటుండగా అకస్మాత్తుగా దూసుకొచ్చిన కుక్క అతనిపై దాడి చేసింది. ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో బాలుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఘటనను గమనించిన తాత, నానమ్మలు వెంటనే స్పందించి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక చికిత్స అనంతరం బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో, వైద్యులు హైదరాబాద్లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో పలువురిని కరిచింది అని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని ఆ కుక్కను అదుపులోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనతో నకిరేకల్ ప్రాంతంలో భయం నెలకొంది. పిల్లలను బయటకు పంపడానికే తల్లిదండ్రులు జంకుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి