Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:21 PM

నకిరేకల్‌లో పిచ్చికుక్క బీభత్సం: నాలుగేళ్ల చిన్నారి ముఖంపై దాడి – ఆందోళనలో తల్లిదండ్రులు

నకిరేకల్‌లో పిచ్చికుక్క బీభత్సం: నాలుగేళ్ల చిన్నారి ముఖంపై దాడి – ఆందోళనలో తల్లిదండ్రులు

నకిరేకల్‌లో పిచ్చికుక్క బీభత్సం: నాలుగేళ్ల చిన్నారి ముఖంపై దాడి – ఆందోళనలో తల్లిదండ్రులు
April 03, 2026 01:21 PM 175 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పిచ్చికుక్క స్వైర విహారం కలకలం రేపింది. వీధిలో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడు శరత్ చంద్రపై ఆకస్మికంగా దాడి చేసిన కుక్క, అతని ముఖంపై తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం మేరకు, శరత్ చంద్ర ఇంటి ముందు ఆడుకుంటుండగా అకస్మాత్తుగా దూసుకొచ్చిన కుక్క అతనిపై దాడి చేసింది. ముఖంపై తీవ్ర గాయాలు కావడంతో బాలుడు అపస్మారక స్థితిలో పడిపోయాడు. ఘటనను గమనించిన తాత, నానమ్మలు వెంటనే స్పందించి సమీప ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం బాలుడి పరిస్థితి విషమంగా ఉండటంతో, వైద్యులు హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని తెలుస్తోంది. ఆ ప్రాంతంలో పలువురిని కరిచింది అని స్థానికులు చెబుతున్నారు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని చిన్నారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని ఆ కుక్కను అదుపులోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనతో నకిరేకల్ ప్రాంతంలో భయం నెలకొంది. పిల్లలను బయటకు పంపడానికే తల్లిదండ్రులు జంకుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ప్రజల భద్రతకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News