Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:40 PM

నకిరేకల్‌లో జర్నలిస్ట్ రఘు అరెస్ట్

నకిరేకల్‌లో జర్నలిస్ట్ రఘు అరెస్ట్

నకిరేకల్‌లో జర్నలిస్ట్ రఘు అరెస్ట్
February 24, 2026 03:07 PM 191 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Chityala
Komidala Mahender reddy

ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో పేద ప్రజల 1000కు పైగా గుడిసెల కూల్చివేత ఉద్రిక్తతలమధ్యకొనసాగుతుండగా, ఆ ప్రాంతానికి వెళ్తున్న సీనియర్ జర్నలిస్ట్ రఘును పోలీసులు నకిరేకల్‌లో అరెస్ట్ చేసిన ఘటన చర్చనీయాంశంగా మారింది.

ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల గ్రామంలో సుమారు 15 వేల మంది పోలీసుల భారీ బందోబస్తుతో జేసీబీల సహాయంతో గుడిసెల తొలగింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారని అధికారుల వాదన కాగా, దశాబ్దాలుగా అక్కడే నివసిస్తున్న పేద కుటుంబాలను బలవంతంగా వెలివేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ క్రమంలో పరిస్థితిని కవర్ చేయడానికి బయలుదేరిన జర్నలిస్ట్ రఘును నకిరేకల్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనుమతి లేకుండా ఆ ప్రాంతానికి వెళ్తున్నారని, శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే జర్నలిస్టుల సంఘాలు ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యలని వారు అభిప్రాయపడ్డారు.

వెలుగుమట్లలో కూల్చివేతల సమయంలో మహిళలు, వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారులతో కలిసి బహిరంగ ప్రదేశాల్లో నిలబడి తమ నివాసాలను కాపాడాలని వేడుకున్నారు. కొంతమంది స్థానిక నాయకులను కూడా పోలీసులు గృహనిర్బంధంలో ఉంచినట్లు సమాచారం.ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు స్పందించాయి. పేదల పట్ల ప్రభుత్వ వైఖరి అన్యాయమని విమర్శించాయి. మరోవైపు, అధికార వర్గాలు మాత్రం న్యాయస్థానాల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టినట్లు వివరణ ఇస్తున్నాయి.జర్నలిస్ట్ రఘు అరెస్టు నేపథ్యంలో మీడియా వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అతన్ని తక్షణం విడుదల చేయాలని జర్నలిస్టుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News