నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత మానవీయత
నకిరేకల్ స్థానిక ప్రతినిధి
నియోజకవర్గ కేంద్రం చీమలగడ్డలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన వంటెపాక నర్సమ్మ ఇటీవల మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఆమె మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, దహన సంస్కారాల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే నర్సమ్మ అంతిమయాత్రలో పాల్గొని తన మానవీయతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సహాయానికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి