స్థానిక ప్రతినిధి
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం కేంద్రంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా స్థానిక చర్చ్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పాల్గొన్నారు. ప్రార్థన అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.
సర్వమత సమభావమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సోదరభావాలకు ప్రతీక అని, ఇటువంటి పండుగలు సమాజంలో ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి