Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:35 AM

నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
31-12-2025 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ స్థానిక ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2025లో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో వచ్చే ఏడాదిలోనూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత పురోగతిపథంలో నడిపించి ఆదర్శంగా నిలుపుతామని చెప్పారు.

గత ఏడాది ప్రజలు సుఖసంతోషాలతో గడిపినట్టే, ఈ ఏడాది ప్రతి కుటుంబం సుఖశాంతులతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత కొత్త లక్ష్యాలు నిర్ధారించుకుని వాటిని సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిరంతర కృషితో వచ్చే ఏడాదికి ఆ లక్ష్యాలను చేరుకునేలా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.

2025కు వీడ్కోలు పలుకుతూ, 2026లోకి అడుగుపెడుతున్న రాష్ట్ర ప్రజలందరికీ శుభం కలగాలని కోరుతూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Article Image
నకిరేకల్ స్థానిక ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2025లో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో వచ్చే ఏడాదిలోనూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత పురోగతిపథంలో నడిపించి ఆదర్శంగా నిలుపుతామని చెప్పారు.

గత ఏడాది ప్రజలు సుఖసంతోషాలతో గడిపినట్టే, ఈ ఏడాది ప్రతి కుటుంబం సుఖశాంతులతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత కొత్త లక్ష్యాలు నిర్ధారించుకుని వాటిని సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిరంతర కృషితో వచ్చే ఏడాదికి ఆ లక్ష్యాలను చేరుకునేలా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.

2025కు వీడ్కోలు పలుకుతూ, 2026లోకి అడుగుపెడుతున్న రాష్ట్ర ప్రజలందరికీ శుభం కలగాలని కోరుతూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News