నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం
Editor Desk
నకిరేకల్ స్థానిక ప్రతినిధి
నకిరేకల్ నియోజకవర్గ ప్రజలకు ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా ఎమ్మెల్యే వేముల వీరేశం శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది సరికొత్త ఆలోచనలు, ఆశయాలు, స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో 2025లో రాష్ట్రం అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించిందని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో వచ్చే ఏడాదిలోనూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత పురోగతిపథంలో నడిపించి ఆదర్శంగా నిలుపుతామని చెప్పారు.
గత ఏడాది ప్రజలు సుఖసంతోషాలతో గడిపినట్టే, ఈ ఏడాది ప్రతి కుటుంబం సుఖశాంతులతో విలసిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత కొత్త లక్ష్యాలు నిర్ధారించుకుని వాటిని సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిరంతర కృషితో వచ్చే ఏడాదికి ఆ లక్ష్యాలను చేరుకునేలా ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు.
2025కు వీడ్కోలు పలుకుతూ, 2026లోకి అడుగుపెడుతున్న రాష్ట్ర ప్రజలందరికీ శుభం కలగాలని కోరుతూ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి